Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల వెంకన్నకు బంగారు వెండి కానుకలే.. కానుకలు..!

శ్రీవారి బంగారు, వెండి, రాగి డాలర్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తిరుమల, తిరుపతితోపాటు చెన్నై, ముంబైలో భక్తుల సౌకర్యార్థం ఈ డాలర్లను తితిదే అందుబాటులో ఉంచింది. భక్తులు తమ పుట్టినరోజు, పెళ్ల

Webdunia
మంగళవారం, 7 మార్చి 2017 (17:50 IST)
శ్రీవారి బంగారు, వెండి, రాగి డాలర్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తిరుమల, తిరుపతితోపాటు చెన్నై, ముంబైలో భక్తుల సౌకర్యార్థం ఈ డాలర్లను తితిదే అందుబాటులో ఉంచింది. భక్తులు తమ పుట్టినరోజు, పెళ్లిరోజు, పర్వదినాలు తదితర శుభసందర్భాల్లో అపురూపుమైన శ్రీవారి డాలర్లను కొనుగోలుచేస్తున్నారు. ఒకవైపు శ్రీవేంకటేశ్వరస్వామి, మరోవైపు శ్రీపద్మావతి అమ్మవారి ప్రతిమలతో ఉన్న ఈ డాలర్లను భక్తులు ఎంతో భక్తిభావంతో ధరిస్తున్నారు. దీనివల్ల స్వామి, అమ్మవార్లు నిత్యం తమకుతోడుగా నీడగా ఉంటారన్నది భక్తుల విశ్వాసం.
 
బంగారు డాలర్లు 10 గ్రాములు, 5 గ్రాములు, 2 గ్రాముల బరువుతోను, వెండి, రాగి డాలర్లు 10 గ్రాములు, 5 గ్రాముల బరువుతోను భక్తులకు అందుబాటులో ఉన్నాయి. బంగారు, వెండి డాలర్ల ధరను వారానికి ఒకసారి మార్కెట్‌ ధరకు అనుగుణంగా నిర్ణయిస్తారు. ప్రతి బుధవారం ఉదయం నుంచి మంగళవారం రాత్రి వరకువారం రోజుల పాటు ఒకే ధర ఉంటుంది. రాగి డాలర్ల ధరలో ఎలాంటి మార్పు ఉండదు. 
 
శ్రీవారి బంగారు, వెండి, రాగి డాలర్లు తిరుమల, తిరుపతితోపాటు చెన్నై, ముంబైలో భక్తులకు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదురుగా గల తితిదే పుస్తక విక్రయశాల పక్కన ఉన్న స్టాల్‌, లడ్డూ కౌంటర్ల వద్దగల ఒకటో కౌంటర్‌లో డాలర్లు లభిస్తాయి. ఈ రెండు కౌంటర్లు ఆంధ్రా బ్యాంకు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న డాలర్ల విక్రయ కేంద్రం 24 గంటలు పని చేస్తుంది. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం స్వైపింగ్‌ యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 
 
మార్చి 6వ తేదీనాటికి తిరుమలలోని కౌంటర్లలో 10 గ్రాముల బంగారు డాలర్లు 469, 5 గ్రాముల బంగారు డాలర్లు 1296, 2 గ్రాముల బంగారు డాలర్లు 46 ఉన్నాయి. అదేవిధంగా 10 గ్రాముల వెండి డాలర్లు 3,244, 5 గ్రాముల వెండి డాలర్లు 1,301 ఉన్నాయి. రాగి డాలర్ల నిల్వలేదు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం లోపలగల డాలర్ల విక్రయ కేంద్రం సిండికేట్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో నడుస్తోంది. చెన్నై, ముంబై నగరాల్లో గల తితిదే సమాచార కేంద్రాల్లో డాలర్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Masood Azhar: మసూద్ అజార్‌కు రూ.14కోట్ల పరిహారం ఇస్తోన్న పాకిస్థాన్.. ఎందుకంటే?

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

Bihar: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి విషం తాగింది.. ఆ తర్వాత ఏమైందంటే?

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

అన్నీ చూడండి

లేటెస్ట్

11-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

11-05-2015 నుంచి 17-05-2025 వరకు మీ రాశి ఫలితాలు

Tirumala: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత-తిరుమల కొండపై భద్రతను పెంచిన టీటీడీ

శనిత్రయోదశి: శనివారం, త్రయోదశి తిథి.. విశేష పర్వదినం

Shani Trayodashi 2025: శని త్రయోదశి నాడు ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments