Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ...

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (07:43 IST)
తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరుగనుంది. ఈ బ్రహ్మోత్సవాలు 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. అయితే, కోవిడ్ 19 పరిస్థితుల దృష్ట్యా ఈ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించేలా తితిదే పాలక మండలి ఏర్పాట్లు చేసింది. 
 
ఇదిలావుంటే, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ఉత్సవాల అంకురార్పణ జరుగనుంది. ఈ సంద‌ర్భంగా విశ్వక్సేనుల వారిని రంగనాయకుల మండపంలోకి వేంచేపు చేస్తారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో కార్యక్రమం అత్యంత ముఖ్యమైంది. 
 
ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. వైఖానస ఆగమాన్ని పాటించే తిరుమల, ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ. 
 
అదేరోజు రాత్రి బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణం జరుగుతుంది. శనివారం సాయంత్రం 6.03 నుంచి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఆ తర్వాత రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది.
 
మరోవైపు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈనెల 19 నుంచి ఏకాంతంగా జరుగుతున్నందున.. ఆ సమయంలో ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన భక్తులే కొండకు రావాలని టీటీడీ సీవీఎస్వో గోపినాథ్‌జెట్టి కోరారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల భద్రత, ప్రముఖుల పర్యటన ఏర్పాట్లపై అర్బన్‌ ఎస్పీ రమేష్‌రెడ్డితో కలిసి గురువారం సాయంత్రం ఆనయ తిరుమలలో సమీక్షించారు. 
 
ఈ సందర్భంగా గోపినాథ్‌జెట్టి మీడియాతో మాట్లాడుతూ.. పెరటాసి మాసంలో తమిళనాడు నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందన్నారు. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో సర్వదర్శన టోకెన్లు తాత్కాలికంగా రద్దయ్యాయని, ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు బుక్‌ చేసుకునే తిరుమలకు రావాలని తమిళనాడులోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. 
 
ప్రముఖుల పర్యటనలో తిరుపతి అర్చన్‌ పోలీసులతో కలిసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామన్నారు. టీటీడీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న 49 ఆలయాలు, విద్యాసంస్థలు, హాస్టళ్లు, కల్యాణమండపాల వద్ద భద్రతా ఏర్పాట్లపై సమీక్షించామన్నారు. టీటీడీ ఆలయాల్లోని 20 ఆలయాల్లో బంగారు, చెక్కరథాల వద్ద భద్రతకు సిబ్బందికి విధులు కేటాయించడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Midhun Reddy: మిధున్ రెడ్డిని పట్టించుకోని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి?

Nara Lokesh: కర్ణాటకపై నారా లోకేష్ దూకుడు విధానం.. ఈ పోటీ రాష్ట్రాలకు మేలు చేస్తుందిగా?

పూజ చేస్తూ కుప్పకూలిపోయిన పూజారి.. అంబులెన్స్ దొరకలేదు.. వైద్యులు లేరు..?

Janasena: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నిర్మాత రామ్ తాళ్లూరి

Tomato virus: మధ్యప్రదేశ్‌లో విజృంభించిన టమోటా వైరస్.. చిన్నారులు జాగ్రత్త

అన్నీ చూడండి

లేటెస్ట్

148 ఏళ్ల నాటి కన్యకా పరమేశ్వరి కోటి కుంకుమార్చన.. రూ.5కోట్ల బంగారం, కరెన్సీతో అలంకారం

Suryaprabha Seva: సూర్యప్రభ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి.. వీక్షితే..?

01-10- 2025 నుంచి 31-10-2025 వరకు మీ మాస ఫలితాలు

Bathukamma: తెలంగాణలో పూల బతుకమ్మతో ముగిసిన బతుకమ్మ పండుగ

Daily Horoscope: 30-09-2025 మంగళవారం ఫలితాలు- మిమ్ముల్ని తక్కువ అంచనా వేసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments