Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాయా జూదం శకునికి తగిన శాస్తి.. సహదేవుని చేతిలో హతం.. ఎలా?

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2015 (16:11 IST)
మహాభారత కురుక్షేత్ర యుద్ధం ద్రౌపదికి జరిగిన అవమానంతో ఏర్పడింది. ఇరువైపులా రాయబారాలు విఫలమవడంతో కౌరవులు, పాండవులు యుద్ధానికి సిద్ధమవుతారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహావీరులతో దుర్యోధనుడు యుద్ధానికి సంసిద్ధుడవుతాడు. ఈ యుద్ధం ధర్మ సంస్థాపన కోసం జరిగింది. కానీ ఈ యుద్ధానికి కారణమైన శకుని సహదేవుని చేతులతో వధించబడతాడు. మహాసంగ్రామములో సహదేవుడు శకునికి ఎదురౌతాడు. 
 
శకుని కుతంత్రుడే కానీ కువీరుడు కాదు. అతడు సహదేవుడితో తలపడి పది బాణములు అతడి శరీరంలో గ్రుచ్చుతాడు. ఆ దెబ్బకు సహదేవుడు మూర్ఛిల్లగా అది చూసి భీముడు శకుని ముందున్న గాంధార సైన్యమును సర్వ నాశనం చేసేస్తాడు. అది చూసి కౌరవసేనలు పారిపోగా సుయోధనుడు ధైర్యం చెప్పి వారిని ముందుకు పురికొల్పుతాడు. సహదేవుడు మూర్ఛ నుండి తేరుకుని శకుని మీద పది బాణములు ప్రయోగించి అతడి విల్లు ఖండిస్తాడు. 
 
శకుని వేరొక విల్లు తీసుకొని సహదేవుడి మీద శరవర్షం కురిపిస్తాడు. శకుని కుమారుడైన ఉలూకుడు.. సహదేవ, భీమసేనుల మీద బాణవర్షం కురిపించగా సహదేవుడు కోపించి ఒకే ఒక బల్లెము విసిరి ఉలూకుడి తల ఖండిస్తాడు. తన కుమారుడు తన కళ్ళ ముందే చనిపోవడం చూసి చలించిన శకుని ఆగ్రహోదగ్రుడై సహదేవుడి మీద మూడు బాణములు వేయగా సహదేవుడు ఆ మూడు బాణములను ఖండించి శకుని విల్లు విరిచి వేస్తాడు. 
 
శకుని మహా కోపంతో సహదేవునిపై కత్తిని, గధను, బల్లెమును ప్రయోగించాడు. సహదేవుడు వాటిని మధ్యలోనే ఖండించగా అది చూసి శకుని తన రధ రక్షకులతో సహా అక్కడి నుండి పారిపోతాడు. సహదేవుడు అతడిని నిలువరించి "ఓ గాంధార రాజా ! రాజ ధర్మం విడిచి ఇలా పారిపోవడం నీవంటి సుక్షత్రియునకు తగదు. నాడు జూదం ఆడిననాడు చూపిన చాతుర్యం ఇప్పుడు చూపు. నీవు ఆడించిన మాయా జూదంకు ఫలితం చూసావు కదా సర్వనాశనం అయింది. 
 
నాడు జూదంలో ఓడి పోయి తలలు వంచుకున్న మా కోపాగ్ని జ్వాలల ఫలితం చూచితివి కదా! మమ్ము అవమానించినందుకు సుయోధనుడు తన వారందరిని పోగొట్టుకుని అనుభవిస్తున్నాడు. సుయోధనుడిలా నీ తల తెగి నేలను ముద్దాడేలా చేస్తానని సహాదేవుడు శకునిని హతమార్చి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments