భగవద్గీత సమస్త ఉపనిషత్తుల సారం. నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు భగవద్గీతలో సమాధానాలు దొరుకుతాయి. భగవద్గీత అనుక్షణం మన ఆలోచనని, ఆచరణని ప్రభావితం చేయగల ఒక మహత్తర సాధనం. గీతాసారాన్ని మనసున నింపుకోగలిగితే జీవితంలో సంతోషాన్ని నింపుకోవడం ఎలాగో తెలిసిపోతుంది. శ్రీకృష్ణ పరమాత్మ రణరంగాన అర్జునుడికి గీతోపదేశం గీతను శ్రీకృష్ణాష్టమి రోజున చదివితే కోరిన కోరికలు నెరవేరుతాయి. భగవద్గీత మొత్తం చదవలేనివారి కోసం ‘సప్తశ్లోకీ గీత’ని అయినా నిత్యం ఒక్కసారి పఠిస్తే చాలు. సమస్త కోరికలు తీరతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.