Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయకొండ గంగమ్మా... కొండ కింద చూడమ్మా...!

చిత్తూరు జిల్లాలోని ఆలయాల వద్ద అక్రమార్కుల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను నిలువుదోపిడీ చేసేస్తున్నారు అక్రమార్కులు. జిల్లాలోని తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం తర్వాత అంతటి

Webdunia
ఆదివారం, 10 జులై 2016 (11:47 IST)
చిత్తూరు జిల్లాలోని ఆలయాల వద్ద అక్రమార్కుల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను నిలువుదోపిడీ చేసేస్తున్నారు అక్రమార్కులు. జిల్లాలోని తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం తర్వాత అంతటి ప్రాచుర్యం పొందినది బోయకొండ గంగమ్మ ఆలయం. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల యాత్రికుల కంటే కర్ణాటక, తమిళనాడు నుంచి ఎక్కువగా వస్తుంటారు. బోయకొండ దినదిన ప్రవర్థమానం చెందుతోంది. అయితే ఇక్కడ అక్రమాలకు అంతులేకుండా ఉంది. భక్తులను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. వాహనాల పార్కింగ్‌ ఫీజు వసూలే ఇందుకు నిదర్శనం.
 
బోయకొండ ఆలయానికి ఆది, మంగళ, గురువారాలలో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ప్రధానంగా వాహనాల్లోనే వచ్చేవారే ఎక్కువ. ఈ రోజుల్లో రోజూ 20 వేల మందికిపైగా వస్తుంటారు. ఈ మూడు రోజులూ రోజుకు 2 వేల వాహనాల దాకా వస్తుంటాయి. పార్కింగ్‌ ఫీజు వసూలు బాధ్యతను టెండరుపై కాంట్రాక్టర్‌కు అప్పగించారు. నిబంధనల ప్రకారం కారు, జీపు, టాటా ఏస్‌ వాహనాలకు రూ.80 వసూలు చేయాలి. బస్సు, మినీ బస్సు, టెంపో వంటి వాహనాలకు 100 రూపాయలు తీసుకోవాలి. ఆటోలకు 30 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. అయితే కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నారు. 
 
కారు, జీపులకు వందరూపాయలు, బస్సు, లారీ వంటి వాహనాలకు 120 రూపాయలు ఆటోలకు 50 రూపాయలు వసూలు చేసేస్తున్నారు. ప్రతి వాహనానికి 20 రూపాయలు తక్కువ లేకుండా అదనంగా వసూలు చేసేస్తున్నారు. దీని ప్రకారం రద్దీ ఎక్కువగా ఉండే మూడు రోజుల్లో రోజుకు 40 వేల రూపాయలు అధికంగా దండుకుంటున్నారు. మూడు రోజులకు కలిపి లక్షా 20 వేల రూపాయలు అవుతుంది. నాలుగు వారాలకు 4 లక్షల 80 వేల రూపాయలు. ఏడాదికి 57 లక్షల రూపాయలు అడ్డంగా దోచేస్తున్నారు. ఇదేమిటని ఎవరైనా అడిగితే అదనంగా వసూలు చేస్తున్న రుసుం పంచాయతీకి అని చెబుతున్నారు. 
 
ఇంత జరుగుతున్నా ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక్కడికి వచ్చేవాళ్లు ఎక్కువ మంది పక్క రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో ఎవరూ గట్టిగా ప్రశ్నించలేక పోతున్నారు. టెండరు నిబంధనలు ఉల్లంఘించి అదనంగా వసూలు చేస్తే ఆ టెండరును రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. అయినా స్పందించకపోవడంతో ఈ వసూళ్లలో అధికారులకూ వాటాలున్నాయన్న అనుమానాలు వ్యక్తవుతున్నాయి. కనీసం ఆలయ పరిసరాల్లో పార్కింగ్‌ ఫీజుకు సంబంధించిన బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. అదనంగా వసూలు చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో చెప్పేవారు లేరు. ఇప్పటికైనా బోయకొండలో పార్కింగ్‌ ఫీజు వసూల్లో అక్రమాలకు కళ్ళెం వేయాల్సిన అవసరం ఉంది. దీనిపై దేవదాయశాఖ ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్‌కు ఏసీబీ అల్టిమేటం - నేటి సాయంత్రం వరకు డెడ్‌లైన్

నటి రమ్యశ్రీపై దాడి... పోలీసులకు ఫిర్యాదు.. దాడిచేసింది ఎవరంటే...

Chevireddy: దేశం విడిచి పారిపోయేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యత్నం... అరెస్ట్

Kodali Nani: కోల్‌కతా నుంచి కొలంబోకు కొడాలి నాని-ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన పోలీసులు

భర్తను వేటకొడవలితో నరుకుతుంటే భార్య పారిపోయింది...

అన్నీ చూడండి

లేటెస్ట్

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

తర్వాతి కథనం
Show comments