Webdunia - Bharat's app for daily news and videos

Install App

షిర్డి సాయిబాబాను పూజించడం అంటే కొబ్బరికాయలు కొట్టడం కాదు...

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (19:44 IST)
శ్రీ సాయిబాబా జ్ఞానమూర్తి. వైష్ణవులకు విఠలుడు. శివ భక్తులకు సాక్షాత్తూ పరమేశ్వరుడు. బాబాకు శాంతమే భూషణం. మౌనమే అలంకారం. బాబా సారంలో సారాంశం వంటివారు. నశించిపోయే బాహ్యాంశాలపై అభిమానం లేనివారు. బాబా నిత్యం ఆత్మసాక్షాత్కారంలోనే మునిగి ఉండేవారు. బాబాకు భువి, దివిపై ఉన్న వస్తువులపై ఎలాంటి అభిమానం లేదు. బాబా అంతరంగం అద్దం వలె స్వచ్చమైనది.
 
బాబా పలుకులు అమృత బిందువులు. బాబాకు బీద, ధనిక తారతమ్యాలు లేవు. బాబాకు అందరూ సమానులే. బాబా మానావమానాలను లెక్కచేసేవారు కాదు. బాబా అందరికీ ప్రభువు, యజమాని. బాబా అందరితో కలసిమెలసి ఉండేవారు. ఆడేవారు. పాడేవారు. బాబా పెదవులపై 'అల్లామాలిక్' అనేది నిత్య భగవన్నామస్మరణ. ప్రపంచమంతా మేల్కొని ఉంటే తాను యోగనిద్రలో ఉండేవారు. జగద్రక్షకుడు కదా!
 
బాబా అంతరంగం సముద్రమంత లోతు, ప్రశాంతం, గంభీరం. బాబా దర్బారు ఘనమైనది. వందలకొద్దీ ఉపదేశాలకు అది వేదిక. బాబాది సచ్చిదానంద స్వరూపం. నిరుత్సాహం కానీ, ఉల్లాసం కానీ ఎరుగరు. బాబా తత్త్వం గురించి, బాబాని సేవించే విదానం గురించి మనకు తెలియజేసినవారు పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాష్టారు గారు. భరద్వాజ గారు సాయిలీలామృతాన్ని రచించి మానవాళికి నిజమైన అమృతాన్ని ప్రసాదించారు. బాబా పూర్తి తత్త్వాన్ని తెలియజెప్పారు. 
 
అంతేకాకుండా ఎంతోమంది అవదూతల గురించిన గ్రంధాలు రచించారు. వాటిని పారాయణ చేయడం వల్ల ఆద్యాత్మికత వైపు ఎలా ప్రయాణం చేయాలో తెలుస్తుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది. బాబా పట్ల ప్రేమ కలుగుతుంది. అలాంటి ఈ సద్గురుమూర్తిని మనస్పూర్తిగా పూజించినవారికి ఎలాంటి కర్మలైనా తీరవలసిందే. 
 
బాబాని పూజించడం అంటే మంచి మంచి ప్రసాదాలు పెట్టడం కొబ్బరికాయలు కొట్టడం కాదు. ఎదుటి వారి మనసు బాధపెట్టకుండా ఉండటం, మనలోని అహంకారాన్ని తగ్గించుకోవడం, మనకు ఉన్నంతలోనే నిరుపేదలకు సహాయం చేయడం, బాబా శరీరంతో ఉన్నప్పుడు పలికిన అమృత వాక్కులను మనం అనుసరించడం వలన మనం బాబాకు ఎంతో ఇష్టమైన భక్తులం అవుతాము. అలా చేస్తే మన బాధ్యత అంతా ఆయనే చూసుకుంటారు. అంటే సద్గురువుకి పగ్గాలప్పగించాక చింతకు తావే ఉండదు అన్నమాట.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments