Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేపాక్షిలోని సీతమ్మ పాదాలను స్పర్శిస్తే..?

Webdunia
శనివారం, 22 నవంబరు 2014 (17:11 IST)
సీతమ్మ పాదాలు కనిపించే దివ్య క్షేత్రమే అనంతపురం జిల్లాకి చెందిన 'లేపాక్షి'. అనేక విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక కేంద్రంగా లేపాక్షి అలరారుతోంది. అలాంటి లేపాక్షి క్షేత్రంలో ఒకచోట సీతమ్మవారిదిగా చెప్పబడుతోన్న పాదముద్ర కనిపిస్తుంది. 
 
ఇలాంటి పాదముద్రలు చాలా క్షేత్రాల్లో కనిపిస్తుంటాయి. అయితే ఈ పాదముద్ర యొక్క బొటనవ్రేలు భాగం నుంచి నిరంతరం సన్నని నీటిధార వస్తుండటం విశేషం. మండువేసవిలో సైతం ఈ నీటిధార ఆగకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించకమానదు.
 
సీతమ్మవారి పాదముద్రను తాకితే ఆ తల్లి ఆశీస్సులు లభించినట్లు భక్తులు భావిస్తుంటారు. ఆ నీటిని స్పర్శించినా, తలపై చల్లుకున్నా, తీర్థంగా స్వీకరించినా పాపాలు హరించిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. 
 
రాముడి వెంట వనవాసానికి బయలుదేరిన సీతమ్మ ఎన్నో ప్రాంతలమీదుగా ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది. ఆ తల్లి పాదస్పర్శచే ఈ నేల పునీతమైంది. అలాంటి సీతమ్మవారి పాదముద్రను పదిలంగా తన గుండెల్లో దాచుకుని, దర్శించిన భక్తులను ధన్యులను చేస్తోన్న ఈ మహిమాన్వితమైన క్షేత్రాన్ని చూసితీరవలసిందే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments