Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముక్కంటీ ఆలయంలో వెండి మూలనపడేశారు..!

శ్రీకాళహస్తి ఆలయంలో 15 టన్నులకుపైగా వెండి పోగుబడి ఉంది. ఇక్కడ నిర్వహించే రాహు-కేతు పూజల్లో వెండి నాగపడగలను వినియోగిస్తారు. రోజూ 2 వేలకుపైగా పూజలు జరుగుతుంటాయి. పూజలు చేయించుకునవారికి ఆలయమే నాగపడకలు అం

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2016 (15:48 IST)
శ్రీకాళహస్తి ఆలయంలో 15 టన్నులకుపైగా వెండి పోగుబడి ఉంది. ఇక్కడ నిర్వహించే రాహు-కేతు పూజల్లో వెండి నాగపడగలను వినియోగిస్తారు. రోజూ 2 వేలకుపైగా పూజలు జరుగుతుంటాయి. పూజలు చేయించుకునవారికి ఆలయమే నాగపడకలు అందజేస్తుంది. ఎప్పటికప్పుడు వెండి కొనుగోలు చేసి పడగలు తయారు చేయించేవారు. ఈ విధంగా 15.27 టన్నుల వెండి పోగుబడింది. ఆ తర్వాత ప్రతిసారి వెండి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా 2.50 టన్నుల స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేసి దాన్నే రీసైకిల్‌ చేయడం ద్వారా నాగపడగలు తయారు చేస్తున్నారు. ఇది గత కొంతకాలంగా జరుగుతోంది. అయితే గతంలో కొనుగోలు నాగపడగల రూపంలో పోగైనా 15.27 టన్నుల వెండిన ఇటీవలే హైదరాబాద్‌లోని మింట్‌కు తరలించి కడ్డీలుగా రూపొందించారు. కరిగించిన వెండి ఇటీవలే ఆలయానికి చేరుకుంది.
 
వాస్తవంగా అప్పట్లో పలువురు కార్యనిర్వహణాధికారులు కమిషన్లకు కక్కుర్తుపడి నాణ్యత తక్కువగా ఉన్న వెండి కొనుగోలు చేశారన్న ఆరోపణలున్నాయి. దీనిపైన వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆయా ఈఓల హయాంలో కొనుగోలు చేసిన వెండి పడగలను వేర్వేరుగా కరిగించారు. దీని వల్ల ఎవరు కొనుగోలు చేసిన వెండిలో ఎంత నాణ్యత ఉందో తెలుసుకోవాలన్నది ఆలోచన. ఈ తతంగాన్ని పక్కనబెడితే శ్రీకాళహస్తీశ్వరాలయంలోనూ 15 టన్నులకుపైగా వెండి ఉందన్నమాట. 
 
ఈ వెండిని బ్యాంకుల్లో జమ చేయాలని శ్రీకాళహస్తి దేవస్థానం ఆలోచిస్తోంది. దీని విలువ ప్రస్తుత ధరల ప్రకారం రూ.60 కోట్లు దాకా ఉంటుంది. ఎంత నాణ్యత తగ్గిందనుకున్నా రూ.50 కోట్లకు తగ్గకపోవచ్చు. దీన్ని ఏ విధంగా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలనేది అధికారులు ఆలోచించాలి. ఆలసమయ్యే కొద్దీ స్వామివారు నష్టపోక తప్పదు 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

PoK: పెరిగిన జీలం నది నీటి మట్టం- పాకిస్తాన్‌కు వరద ముప్పు..? (video)

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం-ఆన్‌లైన్ బుకింగ్‌లు

Varuthini Ekadashi 2025: వామనుడికి ఇలా చేస్తే.. కుంకుమ పువ్వు పాలతో..?

24-04-2015 గురువారం ఫలితాలు - ఆప్తులతో సంభాషిస్తారు...

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

తర్వాతి కథనం
Show comments