Webdunia - Bharat's app for daily news and videos

Install App

కపిల తీర్థంలో పుణ్య స్నానం చేస్తే ప్రపంచంలోని తీర్థాలన్నిటిలోనూ... (Video)

Webdunia
సోమవారం, 6 జులై 2020 (22:36 IST)
పూర్వం ఒకప్పుడు ఓ బ్రాహ్మణుడు క్షేత్రాలను దర్శిస్తూ, తీర్థాల్లో మునకలిడుతూ దేశ సంచారం చేస్తుండేవాడు. అసలు ప్రపంచంలో ఎన్ని తీర్థాలు వున్నాయో వాటి అన్నింట్లోనూ స్నానం చేసి తరలించాలని భావించి తిరుగుతుండేవాడు. అలా విశ్రాంతి లేకుండా తిరుగుతున్నందువల్ల చాలా బలహీనుడై శుష్కించిన శరీరంతో, నీరసించి, శోషించి, మగతనిద్రకు లోనయ్యాడు.
 
ఆ నిద్రలో వేంకటేశ్వర స్వామి కనిపించి... ఓ బ్రాహ్మణోత్తమా... నీ ప్రయత్నం అసాధ్యమైంది. నీకే కాదు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. ఎప్పటికీ నెరవేరదు కూడా. కానీ వేంకటాచల క్షేత్రంలో కపిలతీర్థం మొదలుగా అత్యంత ప్రధానమైన హదిహేడు పుణ్యతీర్థాలున్నాయి. వాటిల్లో శాస్త్రోక్తంగా నియమంగా స్నానం చేస్తే చాలు, ప్రపంచంలోని తీర్థాలన్నింటిలోనూ స్నానం చేసిన ఫలితం వస్తుంది.
 
అందులో ఏమాత్రం సందేహం లేదు. అందువల్ల నీవు ఆ పదిహేడు తీర్థాల్లో స్నానం చెయ్యి. నీ కోరిక నెరవేరినట్లవుతుంది అన్నాడు. ఆ స్వప్నం మేరకు బ్రాహ్మణుడు మేల్కొని తన తీర్థాటనను విరమించుకుని వేంకటాచల క్షేత్రానికి వెళ్లి అక్కడ వున్న పదిహేడు తీర్థాలను సేవించి ముక్తి పొందాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

పడక గదిలోకి వచ్చిన ఆవు - ఎద్దు : కప్‌బోర్డులో దాక్కున్న మహిళ (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

Vastu: వాస్తు శాస్త్రం: నల్లపిల్లిని ఇంట్లో పెంచుకోకూడదా? బంగారు పిల్లిని పెంచుకుంటే?

24-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

23-03-2025 ఆదివారం మీ రాశిఫలాలు : ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

23-03-2025 నుంచి 29-03-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments