Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీలి రంగు పువ్వులతో "శనివ్రతం" చేయండి!

Webdunia
మంగళవారం, 12 ఆగస్టు 2014 (17:35 IST)
శనివారం రోజున శనివ్రతం ఆచరించే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వేదపండితులు చెపుతుంటారు. అష్టమి వ్రతాల్లో ప్రసిద్ధి చెందిన శనివత్రాన్ని ఆచరించడం చాలా సులభం. శనివారం సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించాలి. 
 
పూజగదిని, పటాలను శుభ్రం చేసుకుని పసుపుకుంకుమ, పువ్వులతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత పూజ ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుని స్తుతించాలి. తర్వాత పూవులు, అక్షింతలతో శివపార్వతుల విగ్రహానికో లేదా, పటానికో అర్పించి, శివాష్టోత్తరం, గౌరీ లేదా ఉమాష్టోత్తరం చదువుతూ పూజ చేస్తే పుణ్య ఫలాలు సిద్ధిస్తాయి. 
 
శుద్ధాష్టమి, శనివారం, కృత్తికా నక్షత్రం చేయదగ్గ ఈ వ్రతానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని పండితులు అంటున్నారు. శనీశ్వరుని శాంతి అనుగ్రహమే కాకుండా, కృత్తికా నక్షత్రాధిపతి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా పొందవచ్చునని వారు చెబుతున్నారు. ఇకపోతే... శనివారం ఆచరించే ఈ శనివ్రతం చివరిన, నీలం రంగు పువ్వులతో శనీశ్వరాష్టోత్తరం స్తుతించడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. 

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు

19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...

Show comments