గడప దాటి వెళ్లేటపుడు కుడికాలు మాత్రమే లోపలికి వేయాలి, ఎందుకు?

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (22:02 IST)
కుడికాలు మోపుతూ ఇంట్లోకి రావడం వలన సకల శుభాలు కలుగుతాయి. ఈ కారణంగానే వరుడుతో కలిసి నూతన వధువు తన అత్తవారింటిలోకి ముందుగా కుడికాలు పెడుతూ గృహప్రవేశం చేసే ఆచారం తరతరాలుగా వస్తోంది. ఇక కేవలం అత్త వారింటికి కోడలు వచ్చే విషయంలోనే కాదు ... ఎవరి బాగు కోరతామో వారి ఇంటికి కుడిపాదాన్ని మోపుతూ ప్రవేశించాలని అంటారు.
 
కుడి పాదం మోపకుండా ఎడమ పాదం మోపుతూ ప్రవేశించడం వలన అక్కడ నిరంతరం గొడవలు ... సమస్యలు కలిసి కాపురం చేస్తాయని అంటూ వుంటారు. ఈ కారణంగానే గొడవకి సిద్ధపడి వచ్చేవారు ముందుగా ఎడమపాదం మోపుతూ వస్తారని తెలుస్తోంది. 
 
సీత అన్వేషణలో భాగంగా హనుమంతుడు లంకానగరానికి చేరుకున్నప్పుడు ఈ విషయాన్ని గురించే కాసేపు ఆలోచించాడట. తాను కుడిపాదం మోపుతూ లోపలి ప్రవేశించడం వలన రావణాసురిడికి సకల శుభాలు జరుగుతాయని భావించి, ముందుగా ఎడమ పాదాన్ని మోపుతూ లోపలికి వెళ్లాడట. కాబట్టి ఎక్కడైతే సఖ్యతను, సంతోషాన్ని, సంపదను ఆశిస్తామో, అక్కడికి కుడికాలు ముందుగా మోపుతూ వెళ్లాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారుణ్య మరణం కేసు : తుదిశ్వాస విడిచిన హరీశ్ రాణా

Nara Bhuvaneswari: భువనేశ్వరి రాజకీయాల్లోకి వస్తారా? కుప్పం టూర్ అందుకేనా?

పార్లమెంట్‌లో వైకాపాకు తలనొప్పి.. 11 నెంబర్ గది వద్దు.. ట్రోల్స్

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధానికి బ్రేక్: పాక్ చర్చలు

యువతితో అక్రమ సంబంధం... ఇంట్లో తెలిసిందనీ భార్యను చంపేసిన డాక్టర్ భర్త

అన్నీ చూడండి

లేటెస్ట్

21-03-2016 శనివారం ఫలితాలు- చాటుమాటు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు

20-03-2016 శుక్రవారం ఫలితాలు - ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి..

ఇరాన్‌పై దాడి: తిరుమలలో మూతపడిన హోటల్స్.. టీ కూడా దొరక్కట్లేదు.. భక్తుల కష్టాలు

తిరుమల లడ్డూలలో కల్తీకి ఇక చెక్ : FSSAI ల్యాబ్ త్వరలో ప్రారంభం

భద్రాచలంలోని శ్రీరామనవమి- కల్యాణోత్సవానికి రేవంత్ రెడ్డికి పిలుపు

తర్వాతి కథనం
Show comments