మోక్షద ఏకాదశి.. తులసి మొక్కకు నీరు పోయకూడదట.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2023 (11:53 IST)
ఏకాదశి తిథి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఏకాదశుల్లో ముఖ్యమైంది వైకుంఠ ఏకాదశి. ఈ ప్రత్యేకమైన రోజున, భక్తులు ఉపవాసం ఉండి, ఆచారాల ప్రకారం విష్ణువును పూజిస్తారు. ఇలా చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. 
 
మార్గశిర మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. ఈ మోక్షద ఏకాదశి రోజున తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేస్తే, మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. మోక్షద ఏకాదశి శ్రీ కృష్ణ భగవానుడికి ఇష్టమైనది. ఈ రోజున తులసి మాత విష్ణువు కోసం నీరు లేని ఉపవాసాన్ని ఆచరిస్తుంది.
 
 అందుకే తులసి మొక్కకు ఏకాదశి రోజున నీరు పోయటం చేయకూడదు. మోక్షద ఏకాదశి రోజున ఆర్థిక లాభం కోసం ఇలా చేయవచ్చు. తులసి మొక్కలో ఒక నాణేన్ని పాతిపెట్టి, ఆపై తులసీ మాతను నమస్కరించాలి. ఈ పరిహారాన్ని అనుసరించడం ద్వారా, ఒక వ్యక్తి తన ఆర్థిక పరిస్థితిలో మెరుగుదలని చూస్తాడు.
 
మోక్షద ఏకాదశి రోజున తులసి కోట వద్ద తప్పనిసరిగా నెయ్యి దీపం వెలిగించాలి. దీనితో పాటు తులసి చుట్టూ 21 సార్లు ప్రదక్షణలు చేయాలి. ఇలా చేయడం ద్వారా విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడ్‌ను మహిళ కడపులో వదేలేశారు...

పవన్ కళ్యాణ్ వివాదంపై నాలుక మడతేసిన మంత్రి వెంకట్ రెడ్డి

రామేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ అయ్యప్ప భక్తులు మృతి

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

04-12-2025 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

జై గురుదత్త

03-12-2025 బుధవారం దిన ఫలితాలు - అనుకోని ఖర్చు ఎదురవుతుంది...

Tirupati Central Zone: తిరుపతిని సెంట్రల్ జోన్‌గా వుంచి.. ఆధ్యాత్మికత అభివృద్ధి చేస్తాం.. అనగాని

Bhauma Pradosh Vrat 2025: భౌమ ప్రదోషం.. శివపూజ చేస్తే అప్పులు మటాష్.. ఉపవాసం వుంటే?

తర్వాతి కథనం
Show comments