మహాశివరాత్రి ఉత్సవాలు.. రుద్రాభిషేకం, బిల్వార్చనతో సర్వం శుభం

సెల్వి
సోమవారం, 4 మార్చి 2024 (09:14 IST)
మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని సుప్రసిద్ధ శైవ ఆలయాల్లో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శివరాత్రి రోజున ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, అభిషేకాలను వీక్షించడం ద్వారా శుభ ఫలితాలు వుంటాయి. 
 
శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహా శివరాత్రి. పార్వతీదేవిని శివుడు పెళ్లాడిన రోజునే ఈ పండుగను జరుపుకుంటారు. ఇదే రోజు లింగోద్భవం జరిగిందని కూడా చెప్తారు. మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ ముఖ్యం. 
 
ఉదయాన్నే స్నానం చేసి శుచిగా స్నానమాచరించాలి. పాలు పండ్లు తీసుకుంటే సరిపోతుంది. ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ వుండాలి. పరమశివుడు పురుషుడిని సూచిస్తే, పార్వతీ దేవి ప్రకృతిని సూచిస్తుంది. 
 
సృష్టికి మూలమైన శక్తి చైతన్యాల కలయికను మహాశివరాత్రి పర్వదినం సూచిస్తుంది. కనుక మహా శివరాత్రి చాలా ప్రత్యేకం. మహాశివరాత్రి పర్వదినం నాడు సాయంత్రం 6 గంటల సమయం నుండి రాత్రి రెండు గంటల సమయం వరకు చేసే రుద్రాభిషేకం, బిల్వార్చన అష్టైశ్వర్యాలను కలిగిస్తాయని విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇద్దరు స్నేహితుల సరదా పెను ప్రమాదానికి దారితీసింది (వీడియో)

ఇరాన్ పని ముగించి క్యూబా సంగతి చూస్తా: డొనాల్డ్ ట్రంప్

వైకాపా విధ్వంసంతో నవ్యాంధ్ర 30 యేళ్లు వెనక్కి వెళ్లింది : పవన్ కళ్యాణ్

13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేదు

తల్లి బంగారన్ని తెగనమ్మి ఇన్‌స్టాగ్రామ్ ప్రియుడికి బైక్ కొనిచ్చిన ప్రియురాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

03-03-2026 మంగళవారం ఫలితాలు - కష్టానికి తగిన ప్రతిఫలం ఖాయం..

హోలీ మార్చి 4వ తేదీన జరుపుకోవాలట.. ఎందుకంటే.. సంపూర్ణ చంద్రగ్రహణం?

మార్చి 3న చంద్రగ్రహణం-మళ్లీ సంపూర్ణ చంద్రగ్రహణం 2028 డిసెంబరు 31న మాత్రమే

02-03-2026 సోమవారం ఫలితాలు : కార్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం...

01-03-2026 ఆదివారం ఫలితాలు - ఖర్చులు విపరీతం.. పనులు ముందుకు సాగవు...

తర్వాతి కథనం
Show comments