Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాశివరాత్రి ఉత్సవాలు.. రుద్రాభిషేకం, బిల్వార్చనతో సర్వం శుభం

సెల్వి
సోమవారం, 4 మార్చి 2024 (09:14 IST)
మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని సుప్రసిద్ధ శైవ ఆలయాల్లో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శివరాత్రి రోజున ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, అభిషేకాలను వీక్షించడం ద్వారా శుభ ఫలితాలు వుంటాయి. 
 
శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహా శివరాత్రి. పార్వతీదేవిని శివుడు పెళ్లాడిన రోజునే ఈ పండుగను జరుపుకుంటారు. ఇదే రోజు లింగోద్భవం జరిగిందని కూడా చెప్తారు. మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ ముఖ్యం. 
 
ఉదయాన్నే స్నానం చేసి శుచిగా స్నానమాచరించాలి. పాలు పండ్లు తీసుకుంటే సరిపోతుంది. ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ వుండాలి. పరమశివుడు పురుషుడిని సూచిస్తే, పార్వతీ దేవి ప్రకృతిని సూచిస్తుంది. 
 
సృష్టికి మూలమైన శక్తి చైతన్యాల కలయికను మహాశివరాత్రి పర్వదినం సూచిస్తుంది. కనుక మహా శివరాత్రి చాలా ప్రత్యేకం. మహాశివరాత్రి పర్వదినం నాడు సాయంత్రం 6 గంటల సమయం నుండి రాత్రి రెండు గంటల సమయం వరకు చేసే రుద్రాభిషేకం, బిల్వార్చన అష్టైశ్వర్యాలను కలిగిస్తాయని విశ్వాసం.

సంబంధిత వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కవితకు బెయిల్ పొడిగింపు

కౌంటింగ్ నేపథ్యంలో పిఠాపురంలో హింసకు ఛాన్స్ : నిఘా వర్గాల హెచ్చరిక!!

17-05-2024 శుక్రవారం దినఫలాలు - అభివృద్ధికై చేయు ప్రయత్నాలు నెమ్మదిగా...

రాగి ఆభరణాలు ధరిస్తే.. సూర్య గ్రహ, వాస్తు దోషాలు పరార్

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

తర్వాతి కథనం
Show comments