Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్ష‌య‌ తృతీయ నాడు శాస్త్రోక్తంగా ల‌క్ష్మీనారాయ‌ణపూజ

Webdunia
శనివారం, 15 మే 2021 (12:08 IST)
లోక కల్యాణార్థం వైశాఖ మాసంలో టిటిడి తలపెట్టిన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం అక్ష‌య‌తృతీయనాడు తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యం యాగ‌శాల‌లో ల‌క్ష్మీనారాయ‌ణపూజ శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 11నుండి 12 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
 
ఈ సందర్భంగా వర్సిటీ ఆచార్యులు మాట్లాడుతూ విశేషమైన అక్ష‌య‌తృతీయనాడు ల‌క్ష్మీనారాయ‌ణ పూజ చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుందన్నారు. అక్ష‌య‌తృతీయను దానతృతీయ అనికూడా అంటారని, ఈరోజు దానం చేయడం వల్ల విష్ణుప్రాప్తి, కైవల్యప్రాప్తి కలుగుతాయని వివరించారు.
 
ముందుగా సంకల్పంతో ప్రారంభించి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, ల‌క్ష్మీనారాయ‌ణ పూజ చేశారు. అనంతరం విష్ణు అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించారు. ఆ తరువాత క్షమాప్రార్థనతో ఈ పూజ ముగిసింది. ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ ఇతర ఆచార్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో డ్రోన్.. యూట్యూబర్‌ను అరెస్ట్ చేసిన విజిలెన్స్ అధికారులు

16-04-2025 బుధవారం ఫలితాలు : అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

బుధగ్రహంతో భద్ర రాజయోగం.. మిథునం, కన్యారాశి, తులారాశికి అదృష్టం

ఇళ్ళల్లో చేపల తొట్టెలు.. నల్ల చేపలను పెంచవచ్చా? వాస్తు ఏం చెప్తోంది?

శ్రీదుర్గా ఆపదుద్ధారక స్తోత్రం: మంగళవారం పఠిస్తే సర్వ శుభం

తర్వాతి కథనం
Show comments