Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ కార్తీక మాసంలో అరుదుగా వ‌చ్చిన ఐదు సోమవారాలు....

ఈ ఏడాది కార్తీక మాసం అరుదైన‌ది. శివుడికి ప్రీతిపాత్ర‌మైన‌ది సోమవారం... అలాంటిది ఈ కార్తీక మాసం సోమ‌వారంతోనే ప్రారంభం అయింది. అందుకే ఈ మాసంలో అరుదుగా 5 సోమ‌వారాలు వ‌స్తున్నాయి. కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి కలిసి రావటం ఓ ప్రత్యేకత.

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2016 (19:17 IST)
ఈ ఏడాది కార్తీక మాసం అరుదైన‌ది. శివుడికి ప్రీతిపాత్ర‌మైన‌ది సోమవారం... అలాంటిది ఈ కార్తీక మాసం సోమ‌వారంతోనే ప్రారంభం అయింది. అందుకే ఈ మాసంలో అరుదుగా 5 సోమ‌వారాలు వ‌స్తున్నాయి. కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి కలిసి రావటం ఓ ప్రత్యేకత. 
 
ఈ కార్తీక‌మాసంలో న‌వంబ‌రు ఒక‌టిన సోదరి ఇంట భోజనం చేయాలి. కార్తీక మాసంలో మొదటిగా వచ్చేది యమ విదియ.. దీనినే భగినీ హస్త భోజనం.. అన్నాచెల్లెళ్ల పండుగ అని కూడా అంటారు. యమధర్మరాజు సోదరి యమనా దేవి ఒకరోజు అలక చెందగా, ఆయన ఆమెకు ఒక వరం ఇస్తారు. యమ విదియ రోజున ఎవరు తన సోదరి ఇంట భోజనం చేస్తారో వారికి నరక భాదలు ఉండవని చెబుతారు. అందుకే ఈ రోజున సోదరి ఇంట భోజనం చేసి ఆశీర్వచనాలు అందిస్తారు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. 
 
న‌వంబ‌రు 3న‌  నాగుల చవితి... మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకునే పండుగ నాగుల చవితి. ఈ రోజున పుట్టలో పాలు పోసుకుని నాగేంద్రుడికి పూజలు చేస్తారు. సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లి ప్రార్థిస్తారు. పూర్వం తక్షకుడు చేపట్టిన సర్పయాగం వల్ల యాగంలో పడి పాములు చనిపోతాయి. సర్పరాజు తపస్సు చేసి ఇంద్రుడుని ప్రార్థిస్తాడు.ఆయన ఆ యాగాన్ని ఆపించడం వల్ల సర్పజాతికి విముక్తి కలుగుంది. అందుకే ఆ రోజున భక్తులు ఆనందంగా పుట్టలో పాలు పోసి వారికి సమర్పిస్తారు.
 
న‌వంబ‌రు 10 న ఏకాదశి: ఏకాద‌శి నాడు ఉపవాసాలు ఉంటారు. మహావిష్ణువు క్షీర సముద్రంలో శయన ఏకాదశి నుంచి యోగ నిద్రలో ఉండి కార్తీక ఏకాదశి రోజున తిరిగిలేస్తారు. అందుకే ఉపవాసాలు ఉండి మరుసటి రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చి భోజనం చేస్తారు.
 
న‌వంబ‌రు 11న క్షీరాబ్ది ద్వాదశి. ఆరోజు సాయంత్రం ఇంటిలోని తులసి మొక్క దగ్గర ధాత్రి(ఉసిరి మొక్క)ను ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. న‌వంబ‌రు 12న  దీపాలను వెలిగించి మహిళలు పూజలు చేసుకుంటారు. వీటినే ద్వాదశ దీపాలు అంటారు. ఆ రోజున ప్రతి ఇల్లూ దీపాల వెలుగులతో నిండిపోతుంది.
 
న‌వంబ‌రు 14న కార్తీక పౌర్ణమి. కృత్తిక నక్షత్రంతో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. 14వ తేదీన ఉదయం నుంచి ఉపవాసం ఉండి, కార్తీక దామోదరుడిని పూజించి 365 ఒత్తులు వెలిగించి చంద్రుని దర్శనమైన తరువాత ఉపవాస దీక్షను విరమిస్తారు. అంతేకాకుండా కొత్తగా పెళ్లయిన అమ్మాయితో 33 పున్నమి నోములు చేయిస్తారు. ఆ రోజు సాయంత్రం శివాలయంలో అమ్మవారికి గుమ్మడిపండు, కంద, పసుపు మొక్కతో పాటు స్వయంపాకం ఇప్పిస్తారు. 30 తేదిన పోలి స్వర్గం కార్తీక మాసం ఆఖరి రోజు 30న అమావాస్య వెళ్లిన మరుసటి రోజున పోలిస్వర్గం పూజలు చేస్తారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments