Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ కార్తీక మాసంలో అరుదుగా వ‌చ్చిన ఐదు సోమవారాలు....

ఈ ఏడాది కార్తీక మాసం అరుదైన‌ది. శివుడికి ప్రీతిపాత్ర‌మైన‌ది సోమవారం... అలాంటిది ఈ కార్తీక మాసం సోమ‌వారంతోనే ప్రారంభం అయింది. అందుకే ఈ మాసంలో అరుదుగా 5 సోమ‌వారాలు వ‌స్తున్నాయి. కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి కలిసి రావటం ఓ ప్రత్యేకత.

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2016 (19:17 IST)
ఈ ఏడాది కార్తీక మాసం అరుదైన‌ది. శివుడికి ప్రీతిపాత్ర‌మైన‌ది సోమవారం... అలాంటిది ఈ కార్తీక మాసం సోమ‌వారంతోనే ప్రారంభం అయింది. అందుకే ఈ మాసంలో అరుదుగా 5 సోమ‌వారాలు వ‌స్తున్నాయి. కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి కలిసి రావటం ఓ ప్రత్యేకత. 
 
ఈ కార్తీక‌మాసంలో న‌వంబ‌రు ఒక‌టిన సోదరి ఇంట భోజనం చేయాలి. కార్తీక మాసంలో మొదటిగా వచ్చేది యమ విదియ.. దీనినే భగినీ హస్త భోజనం.. అన్నాచెల్లెళ్ల పండుగ అని కూడా అంటారు. యమధర్మరాజు సోదరి యమనా దేవి ఒకరోజు అలక చెందగా, ఆయన ఆమెకు ఒక వరం ఇస్తారు. యమ విదియ రోజున ఎవరు తన సోదరి ఇంట భోజనం చేస్తారో వారికి నరక భాదలు ఉండవని చెబుతారు. అందుకే ఈ రోజున సోదరి ఇంట భోజనం చేసి ఆశీర్వచనాలు అందిస్తారు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. 
 
న‌వంబ‌రు 3న‌  నాగుల చవితి... మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకునే పండుగ నాగుల చవితి. ఈ రోజున పుట్టలో పాలు పోసుకుని నాగేంద్రుడికి పూజలు చేస్తారు. సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లి ప్రార్థిస్తారు. పూర్వం తక్షకుడు చేపట్టిన సర్పయాగం వల్ల యాగంలో పడి పాములు చనిపోతాయి. సర్పరాజు తపస్సు చేసి ఇంద్రుడుని ప్రార్థిస్తాడు.ఆయన ఆ యాగాన్ని ఆపించడం వల్ల సర్పజాతికి విముక్తి కలుగుంది. అందుకే ఆ రోజున భక్తులు ఆనందంగా పుట్టలో పాలు పోసి వారికి సమర్పిస్తారు.
 
న‌వంబ‌రు 10 న ఏకాదశి: ఏకాద‌శి నాడు ఉపవాసాలు ఉంటారు. మహావిష్ణువు క్షీర సముద్రంలో శయన ఏకాదశి నుంచి యోగ నిద్రలో ఉండి కార్తీక ఏకాదశి రోజున తిరిగిలేస్తారు. అందుకే ఉపవాసాలు ఉండి మరుసటి రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చి భోజనం చేస్తారు.
 
న‌వంబ‌రు 11న క్షీరాబ్ది ద్వాదశి. ఆరోజు సాయంత్రం ఇంటిలోని తులసి మొక్క దగ్గర ధాత్రి(ఉసిరి మొక్క)ను ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. న‌వంబ‌రు 12న  దీపాలను వెలిగించి మహిళలు పూజలు చేసుకుంటారు. వీటినే ద్వాదశ దీపాలు అంటారు. ఆ రోజున ప్రతి ఇల్లూ దీపాల వెలుగులతో నిండిపోతుంది.
 
న‌వంబ‌రు 14న కార్తీక పౌర్ణమి. కృత్తిక నక్షత్రంతో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. 14వ తేదీన ఉదయం నుంచి ఉపవాసం ఉండి, కార్తీక దామోదరుడిని పూజించి 365 ఒత్తులు వెలిగించి చంద్రుని దర్శనమైన తరువాత ఉపవాస దీక్షను విరమిస్తారు. అంతేకాకుండా కొత్తగా పెళ్లయిన అమ్మాయితో 33 పున్నమి నోములు చేయిస్తారు. ఆ రోజు సాయంత్రం శివాలయంలో అమ్మవారికి గుమ్మడిపండు, కంద, పసుపు మొక్కతో పాటు స్వయంపాకం ఇప్పిస్తారు. 30 తేదిన పోలి స్వర్గం కార్తీక మాసం ఆఖరి రోజు 30న అమావాస్య వెళ్లిన మరుసటి రోజున పోలిస్వర్గం పూజలు చేస్తారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

Bin Laden: ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు పెద్ద తేడా లేదు.. మైఖేల్ రూబిన్

అన్నీ చూడండి

లేటెస్ట్

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

20-04-2025 నుంచి 26-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

తర్వాతి కథనం
Show comments