దీపావళి నోములు ఎపుడు? లక్ష్మీపూజ ఎపుడు చేయాలి?

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2020 (09:51 IST)
టపాకాయల పండుగ దీపావళి. చిన్నపిల్లలకు అతిపెద్ద పండుగ. చిన్నాపెద్దా ఎంతో ఆనందకరంగా జరుపుకునే పండుగల్లో ఒకటి. అలాగే, మహిళలకు కూడా అతిముఖ్యమైన పండుగ. అయితే, ప్రతియేటా అమావాస్య నాడు వచ్చే ఈ పండుగ ఈసారి రెండు రోజుల సంబురానికి సిద్ధమవ్వమంటున్నది. 
 
అమావాస్య తిథి శని, ఆదివారాల్లో పరివ్యాప్తమై ఉన్నందున రెండురోజుల పర్వంగా మారింది. దీంతో హారతులు, లక్ష్మీపూజలు శనివారం, నోములు ఆదివారంచేసుకోవాలని పంచాంగకర్తలు శాస్త్రప్రకారం నిర్ణయించారు. 
 
ఆశ్వీయుజ బహుళ చతుర్దశి, అమావాస్య తిథులు శనివారం కలిసి వచ్చాయి. శనివారం చతుర్దశి తిథి పగలు 1.35 గంటల వరకు ఉంటుంది. తర్వాత అమావాస్య తిథి ప్రవేశిస్తున్నది. రాత్రంతా అమావాస్య తిథి పరివ్యాప్తమై ఉండటంతో దీపావళి శనివారమే చేసుకోవాలి. అమావాస్య తిథి ఆదివారం ఉదయం 11.15 గంటల వరకు ఉంటుంది. ఫలితంగా దీపావళి సందర్భంగా నిర్వహించే వ్రతాలు ఆదివారం చేసుకోవాలని పంచాంగ కర్తలు సలహా ఇస్తున్నారు. 
 
ఇకపోతే, దీపావళి పండుగ విశేషాలలో ముఖ్యమైనది లక్ష్మీపూజలు. వ్యాపారస్తులంతా దీపావళి సాయంత్రం లక్ష్మీదేవికి పూజలు చేసి, కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీపూజలతోనే కొత్త ఆర్థిక సంవత్సరాన్ని మొదలుపెడతారు. రాత్రిపూట అమావాస్య తిథి ఉన్నప్పుడే లక్ష్మీ పూజలు చేసుకోవాలని పండితులు చెప్తున్నారు. శనివారం సాయంత్రం లక్ష్మీపూజలు చేసుకోవాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

Pawan Kalyan: పీఠాపురంలో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేయనున్న పవన్

అన్నీ చూడండి

లేటెస్ట్

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments