Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మసూక్షం అంటే ఏమిటి?

"ధర్మో రక్షతి రక్షిత" అను సూక్తి అందరికీ తెలిసిందే. మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనలను రక్షిస్తుంది.... అని దాని అర్థం. రక్షించడం అంటే కత్తి, కర్ర పట్టుకుని దానికి కాపలా కాయడం కాదు. ఆచరించదగినది ధర

Webdunia
ఆదివారం, 22 జనవరి 2017 (11:53 IST)
"ధర్మో రక్షతి రక్షిత" అను సూక్తి అందరికీ తెలిసిందే. మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనలను రక్షిస్తుంది.... అని దాని అర్థం. రక్షించడం అంటే కత్తి, కర్ర పట్టుకుని దానికి కాపలా కాయడం కాదు. ఆచరించదగినది ధర్మం. అయితే ఈ ధర్మం ఆచరించే విషయంలో మనకు ఎన్నో సందేహాలు కలుగుతాయి. 
 
సత్యమునే పలుకుము. అసత్యము పలుకరాదు. అనే సూక్తి మనకు తెలిసిందే. ఈ సూక్తికి కట్టుబడి ఎన్నో త్యాగాలు చేసి పురాణపురుషులుగా ప్రసిద్ధికెక్కిన మహనీయులు మనకు ఎందరో ఉన్నారు. అయితే ప్రాణ, విత్త, మానభంగమందు బొంకవచ్చు అని శుక్రాచార్యుని చేత బలిచక్రవర్తికి చెప్పించాడు పోతనామాత్యుడు. అసలు ఏ మానవుడైనా ఈ మూడు సంధర్భాలలోనే అబద్ధ చెకప్పడానికి సిద్థపడతాడు. మరి ఈ సంగతి తెలియకనేనా పోతనంతటి వాడు, వ్యాస భగవానుని బాటలో నడిచి అలా పలికాడు?
 
ఆలస్యం, అమృతం విషం అనే సూక్తితో పాటు నిదానమే ప్రధానం అనే మరొక సూక్తి కూడా ఉంది. ఇలాంటి పరస్పర విరుద్ధమైన ధర్మాలు మనకు ఎన్నో ఉన్నాయి. వీటిని ఎలా ఆచరించాలి అనే విషయంలోనే సందేహాలు కలుగుతాయి. అప్పుడే ఆ ధర్మాన్ని సూక్ష్మంగా పరిశీలించాలి. ఇందుకు నిదర్శనంగా ఒక కథ చూద్దాం. దండ కారణ్యంలో ఓ బుషి ఆశ్రమం కట్టుకుని శిష్యులకు విద్యాదానం చేస్తూ కాలం గడుపుతున్నాడు. సత్యవాది.. అతని ఆశ్రమానికి రెండు ప్రక్కల అరుగులు ఉన్నాయి. ఒకరోజు ఆ బుషి కుడివైపు అరుగు మీద కూర్చుని శిష్యులకు విద్యాబోధన చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఆవు ప్రాణభయంతో ఆర్తనాదం చేస్తూ ఆ ఆశ్రమం ముందు నుంచి పరుగెత్తుకుని వెళ్ళింది. అది చూశాడు ఆ బుషి. ఓ వేటగాడు ఆ ఆవును తరుముతున్నాడని గ్రహించాడు.
 
వేటగాడు వచ్చి ఇలా ఆవు వెళ్ళిందా అని అడిగితే అబద్ధం ఆడరాదు అనే ధర్మానికి కట్టుబడి వెళ్ళింది అని చెప్పాలి. అలా చెబితే తాను గోహత్యకు కారణభూతుడవుతాడు. ఒక్కక్షణం ఆలోచించి తన శిష్యులతో సహా ఆ అరుగుమీద నుంచి లేచి ఎడమవైపు అరుగుమీద కూర్చుని, శిష్యులను మౌనంగా ఉండమని చెప్పి విద్యాబోధన చేస్తున్నాడు. కొంతసేపటికి ఓ వేటగాడు అక్కడకు వచ్చి అయ్యా. ఇలా ఏదైనా ఆవు పరుగెత్తుకుని వెళ్ళిందా అని ఆ బుషిని అడిగాడు. గురువు గారు ఏం చెప్తారా అని శిష్యులు ఆత్రంగా చూస్తున్నారు.
 
ఆ బుషి వేటగాని వంక చూసి నాయనా ఈ అరుగు మీద కూర్చుని నా శిష్యులకు పాఠం చెప్పుతున్నప్పటి నుంచి ఏ ఆవు ఇలా వెళ్ళలేదు అని బదులిచ్చాడు. వేటగాడు సంతృప్తి చెంది వచ్చిన దారినే వెనుదిరిగి వెళ్ళిపోయాడు. బుషి కుడివైపు అరుగు మీద కూర్చున్నప్పుడు ఆవు వెళ్ళింది సత్యం. అందుకే బుషి అరుగు మారి కూర్చున్నాడు. అప్పుడు ఏ ఆవు అటు వెళ్ళలేదు. అది సత్యమే. అదే చెప్పాడు ఆ బుషి. బుషి అసత్యం ఆడలేదు. ఆవు రక్షించబడింది. ఇది కథ. మంచి పనిచేసే విషయంలో ఆలస్యం పనికిరాదు. అప్పుడు ఆలస్యం అమృతం విషం అనే సూక్తిని పాటించాలి. చెడు పని  చేసే విషయంలో నిధానమే ప్రధానం అనే సూక్తిని పాటించాలి. అదే ధర్మసూక్ష్మం. ఈ సూక్ష్మాన్ని గ్రహించగలిగిన వాడే ధర్మాన్ని రక్షిస్తాడు. ధర్మం చేత రక్షింపబడతాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

లేటెస్ట్

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

తర్వాతి కథనం
Show comments