కార్తీకంలో ఉల్లి, పుట్టగొడుగులు, ముల్లంగి తినకూడదట..

కార్తీక మాసం పవిత్రమైనది. ఈ మాసం మొత్తం ప్రతిరోజూ ఉదయం సూర్యోదయానికి ముందు ఇంటి గడపల వద్ద, తులసి చెట్టు వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి.

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (14:30 IST)
కార్తీక మాసం పవిత్రమైనది. ఈ మాసం మొత్తం ప్రతిరోజూ ఉదయం సూర్యోదయానికి ముందు ఇంటి గడపల వద్ద, తులసి చెట్టు వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. కార్తీకంలో అల్పాహారం తీసుకుని, ఒంటిపూట భోజనం చేసేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ నెలంతా ఉపవాసం చేయలేనివారు కనీసం సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి, మాసశివరాత్రి దినాల్లో ఉపవాసం, దీపారాధన చేయాలి. ఉపవాసం చేయకపోయినా.. దీపారాధన చేసేవారికి జీవితంలో సంతోషదాయక మార్పులుంటాయని పండితులు అంటున్నారు.
 
అలాగే ఈ మాసంలో ఉల్లి, పుట్టగొడులు, ఇంగువ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాడలు, వంకాయ, గుమ్మడి, వెలగపండు, మాంసాహారం, పెసలు, సెనగలు, ఉలవలు, కందులు వాడకూడదని పండితులు చెప్తున్నారు. కార్తీకస్నానం చేసినవారి అశ్వమేధ ఫలాన్ని పొందుతారు. కార్తీక దీపాన్ని శివలింగ సన్నిధిలో దీపారాధన చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయి. కార్తీకంలో శివాలయంలో ఆవునేతితోగాని, నువ్వులనూనెతోగాని, ఆఖరికి ఆముదంతోగానీ దీప సమర్పణ చేస్తారో, వారు అత్యంత పుణ్యవంతులౌవుతారని పురాణాలు చెప్తున్నాయి. 
 
విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పది, పదకొండు అధ్యాయాలను పారాయణ చేస్తారో, వారి పాపాలన్నీ తొలగిపోయి వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారని, తులసీదళాలతో, తెలుపు లేక నలుపు గన్నేరుపూలతోగాని శ్రీమహావిష్ణు పూజను చేస్తారో, వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలననుభవిస్తారని, కార్తీకమాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే, పద్దెనిమిది పురాణాలలో ఏదైనా సరే ప్రవచించితే సర్వకర్మబంధ విముక్తులవుతారని వశిష్ఠ వచనం.
 
పూర్వ జన్మ పాపాలన్నీ కూడా కార్తీకవ్రతం వలన హరించుకుపోతాయి. కార్తీకంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవసించి, రాత్రి నక్షత్రదర్శనానంతరం భోజనం చేస్తూ - ఆ రోజంతా భగద్ద్యానంలో గడిపేవాళ్లు తప్పక శివ సాయుజ్యాన్ని పొందుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బర్గమ్ భార్య చాలా అందంగా ఉంటుంది.. అందుకే అతనికి పదవి ఇచ్చా : డోనాల్డ్ ట్రంప్

కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పుల కలకలం - రూ.6 లక్షల దోపిడీ

అమరావతిలో 70 ఎకరాల్లో బిట్స్ పిలానీ క్యాంపస్, 10,000 మంది విద్యార్థులు

బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్‌లో కాలుష్య స్థాయిలు ఎక్కువ

Amaravati: ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఏకైక రాజధాని.. చంద్రబాబు క్లారిటీ

అన్నీ చూడండి

లేటెస్ట్

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

27-01-2026 మంగళవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

26-01-2026 సోమవారం ఫలితాలు - శ్రమతో కూడిన ఫలితాలిస్తాయి...

25-01-2026 నుంచి 31-01-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments