ట్విట్టర్ - ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచిన భారతీయ రైల్వే!

Webdunia
మంగళవారం, 8 జులై 2014 (11:47 IST)
ప్రజలతో మరింత దగ్గరగా అనుసంధానం కావడానికి సామాజిక సమాచారం అనుసంధాన సాధనాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాలను భారతీయ రైల్వే ప్రారంభించింది. తమ శాఖకు చెందిన సమాచారాన్ని అత్యంత వేగంగా ప్రజలతో పంచుకునేందుకే ఈ ఖాతాలు అంటూ రైల్వే మంత్రి సదానంద గౌడ తెలిపారు.
 
కాగా, మంగళవారం లోక్‌సభలో మధ్యాహ్నం 12 గంటలకు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆ వివరాలు కూడా ఈ సామాజిక సైట్లలో లభిస్తాయి. నెటిజన్లు facebook.com/RailMinIndia, twitter@RailMinIndia అనే పేర్లతో రైల్వే శాఖతో అనుసంధానం కావచ్చు. 
 
మరోవైపు.. ఈ రైల్వే బడ్జెట్ పై కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. మోడీ ప్రభుత్వం ఈ సమావేశాలలో తమ తొలి రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టనుండ౦తో సర్వత్రా దీనిపై ఆసక్తి నెలకొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

Show comments