మంగళవారం : అమ్మవారికి నైవేద్యం ఎలా సమర్పించాలి?

Webdunia
సోమవారం, 21 జులై 2014 (17:43 IST)
పేదవాడైన కుచేలుడు సమర్పించిన అటుకులను శ్రీకృష్ణుడు ప్రేమగా అందుకున్నాడు. భక్త కన్నప్ప అందించిన మాంసాన్ని మహాశివుడు నిస్సంశయంగా అందుకున్నాడు. కాబట్టి నైవేద్యంగా ఏం అర్పిస్తున్నామనే దానికంటే భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్నామనేదే ముఖ్యమని పురోహితులు చెబుతున్నారు. ఇందులో మహాకాళి అమ్మవారైనా అంతే. అమ్మవారికి మంగళవారం, శుక్రవారాల్లో పండో, పాయసమో ఎదైనా నైవేద్యంగా పెట్టవచ్చు. అవకాశం ఉంటే ఎన్ని పదార్ధాలను అయినా అర్పించవచ్చు.
 
నానోపహార రూపంచ ||
నానా రస సమన్వితం |
నానా స్వాదుకరం చైవ |
నైవేద్యం ప్రతిగృహ్యతాం ||
 
అనే శ్లోకాన్ని స్మరించుకుంటూ నివేదించిన పదార్ధాలపై నీటిని ప్రోక్షించి "సత్యం త్వర్తేనా పరిషించామి అమృతమస్తు.. అమ్రుతోవస్తరణమసి" అంటూ పదార్థాల చుట్టూ ఔపోసనవిధిగా నీరు చిలకరించాలి. తర్వాత 
 
"ఓం అపానాయస్వాహా
ఓం వ్యానాయస్వాహా 
ఓం ఉదానాయస్వాహా
ఓం సమానాయస్వాహా"
 
అంటూ ఐదుసార్లు అమ్మవారికి నివేదనము చేసి నమస్కరించాలి. "మధ్యే మధ్యే పానీయం సమర్పయామి" అంటూ నీటిని పదార్థాలపై ప్రోక్షించాలి. "ఉత్తరాపోసనం సమర్పయామి", "హస్తౌ ప్రక్షాళయామి", "పాదౌ ప్రక్షాళయామి", "శుద్ధ ఆచమనీయం సమర్పయామి" - ఇలా పలుకుతూ నాలుగుసార్లు నీటిని సపర్పించాలి. ఇలా పై మంత్రాన్ని పఠిస్తూ నైవేద్యం సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా జరుగుతాయని పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ప్రజలకు కొత్త నాయకత్వం కావాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

విధుల నుంచి ఎస్పీ సస్పెన్షన్... మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్‌ పార్టీకి విజయ్ స్నేహాస్తం... పొత్తుకు సంకేతాలు

ఫోన్లు దొంగిలిస్తున్నాడనీ కొడుకును ఇనుప గొలుసుతో కట్టేసిన తల్లిదండ్రులు

డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

01-01-2026 నుంచి 31-01-2026 వరకు జనవరి మాస ఫలితాలు

ముక్కోటి ఏకాదశి: 5 కిలోమీటర్లు సాష్టాంగ నమస్కారం చేస్తూ వెళ్లిన దంపతులు (video)

31-12-2025 బుధవారం ఫలితాలు - పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు...

Sabarimala: శబరిమలలో మకరవిళక్కు ఉత్సవాల సీజన్ ప్రారంభం

Swarna Rathotsavam: వైభవంగా తిరుమలలో స్వర్ణ రథోత్సవం

Show comments