Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రహ సంబంధమైన దోషాల తొలగించాలంటే.. ఇలా చేయాలి..?

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (11:49 IST)
హిరణ్యకశిపుని వలన ప్రహ్లాదుడికి కలిగిన కష్టాల నుంచి విముక్తిని కలిగించడం కోసం, అసురుడైన హిరణ్యకశిపుడి బారి నుంచి సాధుసజ్జనులను రక్షించేందుకుగాను శ్రీమహావిష్ణువు నరసింహస్వామిగా అవతరించారు. అసురసంహారం అనంతరం ఆ ఉగ్రరూపంలోనే స్వామి అనేక ప్రాంతాలలో తిరుగాడుతూ కొండగుహలలో ఆవిర్భవించారు.
 
ఈ కారణంగానే స్వామివారు స్వయంభువుగా ఆవిర్భవించిన ఎక్కువ క్షేత్రాలు గుట్టలపైనా.. గుహల్లోనూ కనిపిస్తుంటాయి. స్వామివారిది ఉగ్రరూపుడైనప్పటికీ.. భక్తుల పట్ల నరసింహస్వామి చల్లని చూపు చూస్తాడని పండితులు చెప్తున్నారు. 
 
నరసింహస్వామిని పూజించడం వలన దుష్టశక్తుల వలన కలిగే బాధలు దూరమైపోతాయి. గ్రహ సంబంధమైన దోషాల వలన పడుతోన్న ఇబ్బందులు తొలగిపోతాయి. తనని ఆరాధించేవారికి స్వామి ధైర్యాన్ని వరంగా ప్రసాదిస్తాడట. ధైర్యమనేది ఒక తెగింపుతో అడుగుముందుకు వేసేలా చేస్తుంది. సంశయమనేది లేకుండా ధైర్యంతో చేసే పనులు సఫలీకృతమవుతాయని చెప్పబడుతోంది.
 
లోకక‌ళ్యాణ కారకుడైన నరసింహస్వామిని పూజించడం వలన గ్రహపీడలు, దుష్టప్రయోగాలు నశిస్తాయి. ధైర్యం, విజయం, సంపద, సంతోషం ఒక్కొక్కటిగా చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahanadu: కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది: చంద్రబాబు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

లేటెస్ట్

28-05-2025 బుధవారం దినఫలితాలు - ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు...

Goddess Lakshmi: శ్రీ లక్ష్మీదేవికి ప్రీతికరమైన రాశులు ఏంటో తెలుసా?

TTD: వేసవి సెలవులు-తిరుమలలో భారీ రద్దీ.. అయినా ఏర్పాట్లతో అదరగొట్టిన టీటీడీ

27-05-2025 దినఫలాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

26-05-2025 సోమవారం దినఫలితాలు - ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

తర్వాతి కథనం
Show comments