Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలినాటి శనిదోషాలు తొలగిపోవడానికి ఇలా పూజలు చేస్తే?

శని అనే మాట వినగానే అందరిలో అలజడి మెుదలవుతుంది. సాధారణ మానవులే కాదు దేవతలు కూడా శనీశ్వరుడంటే భయపడుతుంటారు. శని దేవునికి శనివారం అంటే చాలా ఇష్టమైన రోజు. ఈ రోజున శనీర్వునికి పూజలు చేయడం వలన శనిగ్రహదోషాల

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (11:52 IST)
శని అనే మాట వినగానే అందరిలో అలజడి మెుదలవుతుంది. సాధారణ మానవులే కాదు దేవతలు కూడా శనీశ్వరుడంటే భయపడుతుంటారు. శని దేవునికి శనివారం అంటే చాలా ఇష్టమైన రోజు. ఈ రోజున శనీర్వునికి పూజలు చేయడం వలన శనిగ్రహదోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు. అయితే కొంతమంది శని త్రయోదని రోజున శని దేవుడిని ఎందుకు పూజించాలనే సందేహం కలుగుతుంటుంది.
 
అందుకు ముఖ్యకారణం సూర్యుడు - సంజ్ఞాదేవి దంపతులకు వైవస్వతుడు, యమధర్మరాజు జన్మించారు. సూర్యుని వేడిని భరించలేని సంజ్ఞాదేవి తన నీడకి ప్రాణం పోసి పుట్టింటికి వెళ్లిపోతుంది. ఆ నీడనే ఛాయాదేవి అని పిలుస్తుంటారు. సూర్యుని వలన ఆమె సావర్ణి మనువుకు శనీశ్వరునికి జన్మనిచ్చింది. ఆ రోజే శని త్రయోదశి. ఈ కారణంగానే శనివారంతో కూడిన ఈ త్రయోదశి రోజున శని దేవునికి పూజలు చేస్తుంటారు.
 
ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి శనిశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అదే నూనెతో అభిషేకం చేయాలి. ఆ తరువాత నువ్వుల నూనెతో వంటకాలు తయారుచేసి ఆయనకు నైవేద్యంగా సమర్పించాలి. ఇదే రోజున నువ్వులను, నల్లని వస్త్రాలను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన వాహనమైన కాకికి ఈ రోజున ఆహారాన్ని ఏర్పాటు చేయాలి. 
 
ఏలినాటి శనిదోషాలలో బాధపడుతున్నవారు వరుసగా 13 శనివారాలు శనిదేవునికి పూజలు చేయవలసి ఉంటుంది. ఇలా ఈ శని త్రయోదశి రోజున శనీశ్వరునికి దీపారాధనలు, నైవేద్యాలు పెట్టడం వలన ఏలినాటి శనిగ్రహాదోషాలు తొలగిపోతాయని పురాణంలో చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతి శనివారం రోజున హనుమంతునికి సింధూరాభిషేకం చేయించడం కూడా మంచి ఫలితం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

Srisailam: జూలై 1 నుండి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం

25-06-2025 బుధవారం దినఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య- వేపచెట్టును నాటితే.. తులసీ పూజ చేస్తే ఏంటి ఫలితం?

UPI-enabled kiosks: తిరుమల లడ్డూ చెల్లింపులు ఇక ఈజీ-యూపీఐ కియోస్క్‌‌లు రెడీ

తర్వాతి కథనం
Show comments