108 శివకేశవుల నామాలు ఒక్కసారైనా పఠిస్తే.. యమధర్మరాజు నుంచి విముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అదీ ముఖ్యంగా వారణాసికి వెళ్లినప్పుడు.. మణికర్ణిక తీర్థం వద్ద శివకేశవులను 108 నామాలతో స్తుతించిన వారికి ఇక నరక బాధలంటూ వుండవని.. వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా కార్తీక మాసంలో శివకేశవులను స్తుతించడం మాత్రమే చేయాలి.
ఆ మాసంలోనే కాకుండా ఎప్పుడైనా శివునిని స్తుతిస్తూ కేశవునిని నిందించడం.. కేశవునిని స్తుతిస్తూ శివునిని నిందించడం చేయడం కూడదు. అందులోనూ దామోదరుడు, త్రయంబకుడు ఇద్దరూ కార్తీక మాసంలో భక్తులకు కోరిన వరాలు ఇస్తారని విశ్వాసం.
అందుకే కార్తీకంలో దీపాన్ని పరం జ్యోతిగా భావించి వెలిగిస్తాం. ఆ జ్యోతి.. శివవిష్ణువుల ప్రతీక. ఇంకా శివకేశవుల ప్రేమకు పాత్రులు కావాలంటే.. వారణాసిలోని మణికర్ణిక తీర్థంలో స్నానమాచరించి 108 నామాలతో స్తుతించాల్సిందే. ఇలా చేస్తే అపమృత్యుదోషాలు తొలగిపోతాయి. యమధర్మరాజుచే ఇబ్బందులు వుండవు. అలాగే నరక బాధలుండవు. మోక్షం సిద్ధిస్తుంది.
ముఖ్యంగా వారణాసిలో గానీ ఏదైనా సుప్రసిద్ధ ఆలయాలకు వెళ్లినప్పుడు.. భగవన్నామాలతో స్మరణ చేయడం ద్వారా కోటి పుణ్యాల ఫలితాన్ని మన ఖాతాలో వేసుకోవచ్చు. ఇంకా మహాశివరాత్రి రోజున హరిహర నామాలను ఒక్కసారైనా స్తుతిస్తే.. ఈతిబాధలంటూ వుండవని పండితులు సూచిస్తున్నారు.
ఆలయాల్లో భగవన్నామ స్మరణ చేస్తే కోటిమార్లు చెప్పిన ఫలితం లభిస్తుంది. చివరిగా ప్రదోష కాలంలో హరిహర నామాలతో భగవన్నామస్మరణ చేసే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇదిగోండి.. మీ కోసం.. హరిహర స్తోత్రమ్.. పఠించి ముక్తిని పొందండి.
ధర్మార్థకామమోక్షాఖ్యచతుర్వర్గప్రదాయినౌ |
వన్దో హరిహరౌ దోవౌ త్రైలోక్యపరిపాయినౌ ||
ఓకమూర్తీ ద్విధా భిన్నౌ సంసారార్ణవతారకౌ |
వన్దోహం కామదౌ దోవౌ సతతం శివకోశవౌ ||
దయామయౌ దీనదరిద్రతాపహౌ మహౌజసౌ మాన్యతమౌ సదా సమౌ |
ఉదారలీలాలలితౌ సితాసితౌ నమామి నిత్యం శివకోశవావహమ్ ||