పువ్వులకంటే ఆకు పూజతో ప్రసన్నుడయ్యే హనుమ!

Webdunia
గురువారం, 16 అక్టోబరు 2014 (17:26 IST)
హనుమంతుడు పూలతో కూడిన పూజతో కంటే ఆకు పూజకే అధిక ప్రాధాన్య ఇస్తాడని పండితులు అంటున్నారు. హనుమంతుడికి ఆకుపూజ చేస్తే అనేక గండాలు, ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 
 
హనుమంతుడు ఆకుపూజకు ఇష్టపడటం ఎందుకంటే.. హనుమంతుడు లంకానగారానికి వెళ్లి సీతమ్మవారి జాడను తెలుసుకుంటాడు. ఆమెకి ధైర్యం చెప్పి .. శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగర వాసులకు భయం కలిగేలా చేస్తాడు. ఆ తరువాత అక్కడి నుంచి తిరిగి వచ్చి రాముడిని కలుసుకుని .. సీతను చూసిన విషయం చెబుతాడు.
 
సంతోషించిన శ్రీరాముడు అక్కడ గల తమలపాకులను తెంపి మాలగా చేసి ఆయన మేడలో వేసి అభినందిస్తాడు. శుభవార్తను తెచ్చినవారికి తమ దగ్గర గల ఖరీదైన వస్తువును బహూకరించడం అప్పట్లో ఒక సంప్రదాయంగా ఉండేది. రాముడు వనవాసంలో ఉన్నాడు ... ఇక హనుమంతుడు లంకా నగరంలోని కొన్ని భవనాలను తగలబెట్టి మరీ వచ్చాడు. అందువలన ఆయన శరీరం వేడిగా ఉండటంతో, తాపాన్ని తగ్గించడం కోసం రాముడు ఆయన మెడలో తమలపాకుల మాలను వేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. 
 
ఆ తమలపాకుల మాల మెడలో పడగానే అప్పటివరకూ హనుమంతుడు పడిన శ్రమనంతా మరిచి సంతోషంతో పొంగిపోయాడు. అందుకే తమలపాకులతో పూజ చేస్తే కోరుకున్న వరాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని పురోహితులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యను బూతులు తిట్టిన మహిళను చెప్పుతో కొట్టిన భర్త, వీడియో

తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్ స్లీపర్ క్లాస్ రైలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్.జె.దొర ఇకలేరు

ఓరి వీడి దుంపతెగ, టెస్ట్ డ్రైవ్ అంటూ బెంజ్ కారుతో జంప్

జయలలిత ప్రియ స్నేహితురాలు శశికళ కొత్త పార్టీ పేరు ఇదే...

అన్నీ చూడండి

లేటెస్ట్

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

10-03-2026 మంగళవారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం....

ఈ దొంగ సన్యాసిని బయటకు గెంటండి: సాయిబాబా

ఆదాయం పెరగాలంటే.. ధనవంతులు కావాలంటే.. చాణక్య నీతిని..?

09-03-2026 సోమవారం ఫలితాలు : దంపతుల మధ్య అకారణ కలహం...

Show comments