"ఓం భూర్భువస్సువః భగవత్యై శ్రీ గాయత్రీదేవ్యై నమః పుష్పం సమర్పయామి" అని పుష్పాలను, "పుష్పమాలాం సమర్పయామి" అంటూ పూలదండను అమ్మవారికి సమర్పించాలి. ఈ మంత్రంతో అమ్మవారికి పుష్పాలను సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు. శత్రుభయం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే వారంలో మంగళ, శుక్రవారాల్లో ఇంట అమ్మవారిని పూజించి పుష్పాలను సమర్పించాలని వారు సూచిస్తున్నారు.