అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టాలో తెలుసా?

జగజ్జనని అయిన అమ్మవారి వివిధ రూపాలతో వివిధ నామాలతో పూజలు అందుకుంటూ ఉంటుంది. అలాంటి అమ్మవారిని ఒక్కోరోజున అభిషేకాలు చేయడం, నైవేద్యాలు సమర్పించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (11:57 IST)
జగజ్జనని అయిన అమ్మవారి వివిధ రూపాలతో వివిధ నామాలతో పూజలు అందుకుంటూ ఉంటుంది. అలాంటి అమ్మవారిని ఒక్కోరోజున అభిషేకాలు చేయడం, నైవేద్యాలు సమర్పించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. ఆవు పాలతో అమ్మవారికి అభిషేకం చేయడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయి.
 
ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వలన సిరిసంపదలు చేకూరుతాయి. ఆవునెయ్యితో అభిషేకం చేయడం వలన అనారోగ్యాలు దరిచేరవు. తేనెతో అమ్మవారిని అభిషేకించడం వలన కీర్తి పెరుగుతుంది. పసుపు నీళ్లతో అమ్మవారిని అభిషేకించడం వలన సౌభాగ్యం నిలుస్తుంది. అమ్మవారికి అత్యంత ఇష్టమైన నైవేద్యం పాయసం. 
 
పాయసం నైవేద్యంగా సమర్పించడం వలన అమ్మవారు ప్రీతిచెందుతారు. తన భక్తుల అవసరాలను గ్రహించి వారి మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరేలా అనుగ్రహిస్తుంది. ఆపదలను తొలగిస్తూ ఆయురారోగ్యాలను, సంతాన సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. అందువలన అనునిత్యం అమ్మవారిని పూజిస్తూ, సేవిస్తూ, తరిస్తూ ఉండాలి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తరప్రదేశ్‌లో ఓ బాలుడు ఆరేళ్ల క్రితం అదృశ్యమై.. అస్థిపంజరంగా కనిపించాడు..

సభ్యత్వ డ్రైవ్‌‌లో జనసేన అదుర్స్.. ఒకే రోజులో లక్షకు పైగా కొత్త సభ్యులు

హైదరాబాద్ శివార్లలో ఏఐ సదుపాయాలతో 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

చిలుకూరు శ్రీ బాలాజీ ఆలయ ప్రధాన పూజారి కన్నుమూత

నాకు పవన్ కల్యాణ్ బిగ్ బ్రదర్.. కష్టకాలంలో అండగా నిలిచారు.. నారా లోకేష్

అన్నీ చూడండి

లేటెస్ట్

25-02-06 బుధవారం ఫలితాలు - రుణ సమస్య తొలగుతుంది

24-02- 2026 మంగళవారం ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు

23-02-2026 సోమవారం ఫలితాలు : ఖర్చులు అధికం.. పొదుపు ధనం స్వీకరిస్తారు...

22-02-2026 ఆదివారం ఫలితాలు : రోజువారీ ఖర్చులే ఉంటాయి.. చెల్లింపుల్లో జాప్యం తగదు...

22-02-2026 నుంచి 28-02-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments