అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టాలో తెలుసా?

జగజ్జనని అయిన అమ్మవారి వివిధ రూపాలతో వివిధ నామాలతో పూజలు అందుకుంటూ ఉంటుంది. అలాంటి అమ్మవారిని ఒక్కోరోజున అభిషేకాలు చేయడం, నైవేద్యాలు సమర్పించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (11:57 IST)
జగజ్జనని అయిన అమ్మవారి వివిధ రూపాలతో వివిధ నామాలతో పూజలు అందుకుంటూ ఉంటుంది. అలాంటి అమ్మవారిని ఒక్కోరోజున అభిషేకాలు చేయడం, నైవేద్యాలు సమర్పించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. ఆవు పాలతో అమ్మవారికి అభిషేకం చేయడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయి.
 
ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వలన సిరిసంపదలు చేకూరుతాయి. ఆవునెయ్యితో అభిషేకం చేయడం వలన అనారోగ్యాలు దరిచేరవు. తేనెతో అమ్మవారిని అభిషేకించడం వలన కీర్తి పెరుగుతుంది. పసుపు నీళ్లతో అమ్మవారిని అభిషేకించడం వలన సౌభాగ్యం నిలుస్తుంది. అమ్మవారికి అత్యంత ఇష్టమైన నైవేద్యం పాయసం. 
 
పాయసం నైవేద్యంగా సమర్పించడం వలన అమ్మవారు ప్రీతిచెందుతారు. తన భక్తుల అవసరాలను గ్రహించి వారి మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరేలా అనుగ్రహిస్తుంది. ఆపదలను తొలగిస్తూ ఆయురారోగ్యాలను, సంతాన సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. అందువలన అనునిత్యం అమ్మవారిని పూజిస్తూ, సేవిస్తూ, తరిస్తూ ఉండాలి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమార్తెకు జ్ఞానబోధ చేయడంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ విఫలమయ్యారు : టీఎంసీ ఎంపీ

APSDMA: ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు.. 46 మండలాల్లో తీవ్రమైన వడగాలులు

టీడీపీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్

లిఫ్ట్ వచ్చిందని లోపల అడుగుపెట్టాడు, 3 అంతస్తుల నుంచి కింద పడి స్పాట్ డెడ్, వీడియో

పాత డీఎంకేను చూస్తారు.. కేంద్రం మూల్యం చెల్లించుకోక తప్పదు: ఎంకే స్టాలిన్ హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

ఐదు అత్యుత్తమ మంత్రాలు ఏవి.. శనివారం ఈ మంత్రాలను జపిస్తే?

11-04-2026 శనివారం ఫలితాలు - ఆర్ధిక ఇబ్బందులు అధికం

10-04-2026 శుక్రవారం ఫలితాలు- వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు..

జ్యోతిష్య శాస్త్రం: హనుమంతుడి దగ్గరయ్యే ఆ మూడు రాశులేవి?

చైత్రమాస అష్టమి.. దుర్గ, కాలభైరవ పూజతో విశేష ఫలితాలు..

తర్వాతి కథనం
Show comments