Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్గశిర లక్ష్మీ వ్రతం ఎలా చేయాలో మీకు తెలుసా!?

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2011 (13:34 IST)
FILE
మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని ఈ నెలలో ఏ గురువారమైనా చేసుకోవచ్చునని పండితులు చెబుతున్నారు. పూజ చేసుకునేవారు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి ఆహారం తీసుకోవచ్చు.

గురువారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, పూజగదిని శుభ్రం చేసి కడిగి ముగ్గులు పెట్టాలి. పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. బియ్యప్పిండితో ఎనిమిది దళాల పద్మాన్ని వేసి దానిమీద పసుపు కుంకుమలు జల్లి లక్ష్మీదేవిని నిలిపేందుకు పీఠాన్ని ఉంచాలి.

పీటపై లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని ఉంచాలి. అయిదు తమలపాకులు, అయిదు వక్కలు, అయిదు నాణాలు, అయిదు గరికపోచలు ఉంచాలి. దీపం వెలిగించి, ఐదు రకాల నైవేద్యాలను సమర్పించాలి. కొందరు అయిదు పిడకలను కూడా లక్ష్మీదేవివద్ద ఉంచుతారు.

ఉద్దరిణితో నీటిని లక్ష్మీదేవిమీద చిలకరిస్తూ, పూవులు జల్లుతూ, అక్షతలు జల్లుతూ మహాలక్ష్మి అష్టకాన్ని చదువుతూ దేవిని స్తుతిస్తారు. చివరికి ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేస్తారు.

మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు లక్ష్మీదేవి పూజను భక్తిగా చేసుకున్నవారికి అపార సంపదలు లభిస్తాయని, సుఖశాంతులు ప్రాప్తిస్తాయని చెప్పే అనేక నిదర్శనాలు ఉన్నాయని పండితులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... జ్యోతి మల్హోత్రా ల్యాప్‌టాప్‌ అంత సమాచారం ఉందా?

క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు: ట్రంప్ ఉద్దేశ్యం ఇండియన్స్‌ను ఇంటికి పంపించడమేనా?!!

Nara Lokesh: మహానాడు వీడియోను షేర్ చేసిన నారా లోకేష్ (video)

కర్నాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల బహిష్కరణ వేటు

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. నైరుతి రుతుపవనాలకు తోడు అల్పపీడనం

అన్నీ చూడండి

లేటెస్ట్

25-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిడికి గురికావద్దు.. స్థిమితంగా ఉండండి...

25-05-2025 నుంచి 31-05-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

Sani Pradosham: శనివారం మహా ప్రదోషం: పెరుగు అన్నాన్ని ప్రసాదంగా సమర్పిస్తే?

24-05-2025 శనివారం దినఫలితాలు - ధనసమస్యలు ఎదురవుతాయి

Apara Ekadashi 2025: అపర ఏకాదశి రోజున సాయంత్రం తులసీకోట ముందు నేతి దీపం వెలిగిస్తే?

Show comments