Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ కుమార్తె వివాహం: అతిథులంతా ఉత్తచేతులతోనే..

Webdunia
మంగళవారం, 2 డిశెంబరు 2014 (14:34 IST)
గుజరాత్ వడోదరలోని డాక్టర్ ఆర్.బి.భిసానియా వెరీ పాపులర్. ఇటీవలే ఆయన కుమార్తె వివాహం జరిగింది. పెళ్లికి వచ్చిన అతిథులంతా ఉత్తచేతులతోనే వచ్చారు. గిఫ్టులేమీ పట్టకెళ్లలేదు. కానీ, వారు వధూవరులను ఆశీర్వదించిన తర్వాత పెళ్లికి వెళ్లిన వారు  ఏం చేశారో తెలుసా?... రక్తదానం చేశారు.
 
దాంతోపాటే, అవయవదానం ప్రతిజ్ఞ చేశారు. ఆ విధంగా, మానవత్వాన్నే బహుమతులుగా ఇచ్చారు. దీనికంతటికీ వధువు తండ్రి డాక్టర్ భిసానియానే కారణం. ఆయన అతిథులందరికీ ముందే చెప్పారు... గిఫ్టులు ఏవీ వద్దని, చేయదలిస్తే రక్తదానం, అవయవదానం ప్రతిజ్ఞ చేయమని విజ్ఞప్తి చేశారు. 
 
దీనిపై డాక్టర్ భిసానియా మాట్లాడుతూ, రక్తదానం, అవయవదానంపై చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ ఆలోచన చేశామని చెప్పారు. తన కుమార్తె డాక్టర్ ధ్వని, అల్లుడు డాక్టర్ జయ్ పాండ్య కూడా దానానికి ముందుకువచ్చారని పేర్కొన్నారు. 
 
కాగా, ఈ వివాహంలో ముస్లింలు కూడా రక్తదానం చేసి మతసామరస్యాన్ని చాటారు. నగర శివార్లలో జరిగిన ఈ వివాహంలో 370 మంది వరకు రక్తదానం చేశారట.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments