డాక్టర్ కుమార్తె వివాహం: అతిథులంతా ఉత్తచేతులతోనే..

Webdunia
మంగళవారం, 2 డిశెంబరు 2014 (14:34 IST)
గుజరాత్ వడోదరలోని డాక్టర్ ఆర్.బి.భిసానియా వెరీ పాపులర్. ఇటీవలే ఆయన కుమార్తె వివాహం జరిగింది. పెళ్లికి వచ్చిన అతిథులంతా ఉత్తచేతులతోనే వచ్చారు. గిఫ్టులేమీ పట్టకెళ్లలేదు. కానీ, వారు వధూవరులను ఆశీర్వదించిన తర్వాత పెళ్లికి వెళ్లిన వారు  ఏం చేశారో తెలుసా?... రక్తదానం చేశారు.
 
దాంతోపాటే, అవయవదానం ప్రతిజ్ఞ చేశారు. ఆ విధంగా, మానవత్వాన్నే బహుమతులుగా ఇచ్చారు. దీనికంతటికీ వధువు తండ్రి డాక్టర్ భిసానియానే కారణం. ఆయన అతిథులందరికీ ముందే చెప్పారు... గిఫ్టులు ఏవీ వద్దని, చేయదలిస్తే రక్తదానం, అవయవదానం ప్రతిజ్ఞ చేయమని విజ్ఞప్తి చేశారు. 
 
దీనిపై డాక్టర్ భిసానియా మాట్లాడుతూ, రక్తదానం, అవయవదానంపై చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ ఆలోచన చేశామని చెప్పారు. తన కుమార్తె డాక్టర్ ధ్వని, అల్లుడు డాక్టర్ జయ్ పాండ్య కూడా దానానికి ముందుకువచ్చారని పేర్కొన్నారు. 
 
కాగా, ఈ వివాహంలో ముస్లింలు కూడా రక్తదానం చేసి మతసామరస్యాన్ని చాటారు. నగర శివార్లలో జరిగిన ఈ వివాహంలో 370 మంది వరకు రక్తదానం చేశారట.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో వేడిగాలులు.. అత్యధిక ఉష్ణోగ్రతలు.. ప్రజలకు అలెర్ట్

మూడో సంతానం కంటే రూ.25 వేలు... 18 యేళ్ల వరకు ఉచిత విద్య : ఏపీ సర్కారు

ZP Polls: కొత్త జిల్లాల ఆధారంగా జెడ్పీ ఎన్నికలు.. పవన్ కల్యాణ్

హైదరాబాద్‌లో 36 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం

కూలిపోయిన సుఖోయ్-30 యుద్ధ విమానం.. పైలెట్లు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Sirish: అల్లు కుటుంబానికి మార్చి 6న కలిసి వచ్చే కాలంగా మారింది

Sharva: గంగలోని ప్రశాంతత క్రోధం భోగి లో చూపించనున్న శర్వానంద్

Revanth Reddy: ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

ఇతరుల బాధలో కూడా వినోదం వెతికేవారిని నిలదీసే రోజు రావాలి : అనసూయ

Nani Review: మృత్యుంజయ్ నాకు చాలా నచ్చింది : నేచురల్ స్టార్ నాని రివ్యూ

Show comments