వైకుంఠ ఏకాదశి ముహూర్తం.. పూజా సమయం.. ఎప్పుడంటే?

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (21:49 IST)
వైకుంఠ ఏకాదశి వ్రతాన్నిఈ ఏడాది జనవరి రెండో తేదీన జరుపుకుంటారు. ముక్కోటి  ఏకాదశి తిథి జనవరి 1వ తేదీ ఆదివారం సాయంత్రం 7.12 గంటలకు ప్రారంభమవుతుంది. జనవరి 2వ తేదీ సోమవారం రాత్రి 08.24 గంటలకు ముగియనుంది. జనవరి 3వ తేదీ ఉదయం 07.12 గంటల నుంచి ఉదయం 09.20 గంటల వరకు పుత్రదా ఏకాదశి వేడుకలను జరుపుకుంటారు. వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి కంటే ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. 
 
ఉపవాస వ్రతం ప్రారంభించి.. మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి, పుష్పాలు, గంగాజలం, పంచామృతం చేర్చాలి. ఏకాదశి మరుసటి రోజున అవసరంమైన వారికి ఆహారం అందించాలి. వైకుంఠ ఏకాదశి అన్ని ఏకాదశిలలో అత్యంత పవిత్రమైనది. ఈ రోజును హరి తన భక్తులకు దర్శనం ఇచ్చే రోజుగా చెబుతారు. 
 
వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుండి బయటకు వస్తే 7 జన్మలలో చేసిన పాపాలు పరిష్కారమవుతాయని విశ్వాసం.ఈ ఏకాదశిని స్వర్గ వతిల ఏకాదశి అని కూడా అంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ రోజున దక్షిణాయనంలో నిద్రించిన విష్ణువు ఉత్తరాయణంలో మేల్కొంటాడు. అలాగే మూడు కోట్ల దేవతలకు దర్శనం ఇస్తారని చెబుతారు. కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

AP Cabinet: రూ.1లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం

పెళ్లి చేసుకుని పట్టుమని 10 నెలలైనా వుండలేకపోతున్న జంటలు, ఈ జంట కూడా...

రూ. 6 లక్షలు సుపారీ ఇచ్చి కన్నకొడుకునే హత్య చేయించిన తల్లి, కారణం ఏంటి?

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు : ఎన్.ఐ.ఏ దర్యాప్తు

టీవీకేకు ఉమ్మడి ఎన్నికల చిహ్నాన్ని పొందే ప్రక్రియ ప్రారంభం

అన్నీ చూడండి

లేటెస్ట్

09-11-2025 నుంచి 15-11-2025 వరకూ మీ రాశి ఫలితాలు

08-11-20 శనివారం ఫలితాలు - మీ కష్టం మరొకరికి లాభిస్తుంది

సంకష్టహర చతుర్థి రోజున సంకష్ట నాశన గణేశ స్తోత్రాన్ని పఠిస్తే..?

Sankatahara Chaturthi: శనివారం సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే శనిదోషాలు పరార్

07-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య పరిష్కారం అవుతుంది..

తర్వాతి కథనం
Show comments