Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ఏకాదశి ముహూర్తం.. పూజా సమయం.. ఎప్పుడంటే?

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (21:49 IST)
వైకుంఠ ఏకాదశి వ్రతాన్నిఈ ఏడాది జనవరి రెండో తేదీన జరుపుకుంటారు. ముక్కోటి  ఏకాదశి తిథి జనవరి 1వ తేదీ ఆదివారం సాయంత్రం 7.12 గంటలకు ప్రారంభమవుతుంది. జనవరి 2వ తేదీ సోమవారం రాత్రి 08.24 గంటలకు ముగియనుంది. జనవరి 3వ తేదీ ఉదయం 07.12 గంటల నుంచి ఉదయం 09.20 గంటల వరకు పుత్రదా ఏకాదశి వేడుకలను జరుపుకుంటారు. వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి కంటే ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. 
 
ఉపవాస వ్రతం ప్రారంభించి.. మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి, పుష్పాలు, గంగాజలం, పంచామృతం చేర్చాలి. ఏకాదశి మరుసటి రోజున అవసరంమైన వారికి ఆహారం అందించాలి. వైకుంఠ ఏకాదశి అన్ని ఏకాదశిలలో అత్యంత పవిత్రమైనది. ఈ రోజును హరి తన భక్తులకు దర్శనం ఇచ్చే రోజుగా చెబుతారు. 
 
వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుండి బయటకు వస్తే 7 జన్మలలో చేసిన పాపాలు పరిష్కారమవుతాయని విశ్వాసం.ఈ ఏకాదశిని స్వర్గ వతిల ఏకాదశి అని కూడా అంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ రోజున దక్షిణాయనంలో నిద్రించిన విష్ణువు ఉత్తరాయణంలో మేల్కొంటాడు. అలాగే మూడు కోట్ల దేవతలకు దర్శనం ఇస్తారని చెబుతారు. కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

తర్వాతి కథనం
Show comments