తిరుచానూరులో వార్షిక పవిత్రోత్సవాలు... మూడు రోజుల పండగ

సెల్వి
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (11:20 IST)
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక పవిత్రోత్సవాలు సెప్టెంబర్ 16-18 తేదీల మధ్య సెప్టెంబరు 15న అంకురార్పణంతో నిర్వహించబడతాయి. మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట, రెండవ రోజు పవిత్ర సమర్పణ, చివరి రోజు పవిత్ర పూర్ణాహుతి నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సెప్టెంబర్ 10న నిర్వహించనున్నారు.
 
ఈ నేప‌థ్యంలో ఈ మూడు రోజులు కల్యాణోత్సవం, బ్రేక్‌ దర్శనం, వేద ఆశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్‌సేవలు ర‌ద్దు చేసినట్లు టీటీడీ ప్రక‌టించింది. ఈ ఉత్సవాలకు సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరగనుంది.
 
ఈ సందర్భంగా సెప్టెంబరు 16న పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. రూ.750 చెల్లించి ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. భక్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బావతో భార్య నవ్వుతూ మాట్లాడిందని పీక కోసిన భర్త, ఆపై ఆత్మహత్య

వాగులో వజ్రాలు దొరుకుతున్నాయని నంద్యాల గాజులపల్లె ప్రజలు క్యూ (video)

kakinada, బస్సుకోసం వేచి చూస్తున్నవారిపైకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు దుర్మరణం

stray dogs, ఆడు మగాడ్రా బుజ్జీ, వీధి కుక్కల్ని తరిమికొట్టిన బుజ్జిగాడు (video)

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

అన్నీ చూడండి

లేటెస్ట్

శివాష్టకం విన్నా, పఠించినా కలిగే ఫలితాలు

సూతకంలో శుభకార్యానికి వెళ్లవచ్చా?

05-11-2025 బుధవారం ఫలితాలు - మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు

Kartik Purnima: కార్తీక పూర్ణిమ.. శివకేశవులను పూజిస్తే సర్వం శుభం.. నేతి దీపాన్ని?

కార్తీక పౌర్ణమి: 365 వత్తులతో దీపాన్ని వెలిగించేటప్పుడు ఇది చేయకండి..

తర్వాతి కథనం
Show comments