Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక శుద్ధ అష్టమి.. Oct 31 శుక్రవారం గోపూజ చేయండి!

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2014 (19:03 IST)
కార్తీక శుద్ధ అష్టమి.. అక్టోబర్ 31.. అదే శుక్రవారం పూట గోపూజ చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని పంచాంగ నిపుణులు అంటున్నారు. గోవును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజలు చేయడం ఆనవాయితీ. 
 
అయితే కార్తీకంలో వచ్చే శుద్ధ అష్టమి నాడు గోపూజ చేయడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. కార్తీక శుద్ధ అష్టమినే గోష్ఠాష్టమి అని పిలుస్తారు. శుక్రవారం పూట ఉదయాన్నే స్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి పూజా మందిరంలో శ్రీకృష్ణుడి ప్రతిమను షోడశ ఉపచారాలతో సేవించాలి.
 
ఆ తరువాత గోశాలలో గల గోవును అలంకరించి, ప్రదక్షిణలు చేసి పూజించాలి. కొంతమంది మరింత భక్తిశ్రద్ధలతో ఈ రోజున గోష్ఠాష్టమి వ్రతాన్ని కూడా ఆచరిస్తుంటారు. గోవు లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పబడుతోంది కనుక, గోవును పూజించడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది. 
 
సిరిసంపదలకు ... పాడిపంటలకు కొదవనేది ఉండదని పండితులు అంటున్నారు. ఇంకా గోమాత పూజ సకల దేవతలను పూజించినట్లవుతుందని, తద్వారా ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాధులు దూరమవుతాయని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments