Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి కల్యాణోత్సవం జరిపించండి.. వివాహ అడ్డంకులు, రాహు, కేతు దోషాల్ని తొలగించుకోండి..!

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సర్వశుభాలు చేకూరుతాయని అందరి నమ్మకం. తిరుమల కొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరుడి దర్శనంతో పాటు ఆయనకు జరిగే ఆర్జిత సేవలు, కల్యాణోత్సవాలు దర్శించుకునే వారికి

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2016 (14:10 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సర్వశుభాలు చేకూరుతాయని అందరి నమ్మకం. తిరుమల కొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరుడి దర్శనంతో పాటు ఆయనకు జరిగే ఆర్జిత సేవలు, కల్యాణోత్సవాలు దర్శించుకునే వారికి సైతం అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వర స్వామిగా తిరుమల కొండలపై స్వయంభువుగా అవతరించినట్లు భవిష్యోత్తర పురణాంతో పాటు వేంకటాచల మహాత్మ్యం చెప్తోంది. అలాంటి పవిత్రమైన శ్రీవారి ఆలయం నిత్యకల్యాణం .. పచ్చతోరణంగా ఉంటుంది. 
 
అసలే వైభవంతో వెలుగొందే స్వామి .. అలాంటి ఆయన కల్యాణోత్సవం చూడటానికి రెండుకళ్ళూ చాలవు. స్వామి కల్యాణోత్సవాన్ని తిలకిస్తే ఆ జన్మ ధన్యమైనట్లేనని పండితులు చెప్తున్నారు. అందుకే తిరుమలలో శ్రీవారికి కల్యాణం జరిపించేందుకు భక్తులు పోటీపడుతుంటారు. శ్రీవారి సమేత అమ్మవారికి భక్తిశ్రద్ధలతో కల్యాణాన్ని జరిపించే వారికి సమస్త కష్టాలు తొలగిపోతాయి. దోషాలు, పాపాలు, నశించిపోతాయి. 
 
దారిద్ర్యము, దుఃఖము దూరమవుతుంది. ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఇంకా చెప్పాలంటే.. స్వామివారి కల్యాణాన్ని చేయించినవారికి ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో, చూసినవారికి సైతం అంతటి పుణ్యఫలం లభిస్తుందని స్పష్టమవుతోంది. ఇలా నిత్యకల్యాణం వల్లనే శ్రీవారికి కల్యాణచక్రవర్తి అనే పేరు సార్థకమైంది. వివాహ అడ్డంకులు తొలగిపోవాలంటే శ్రీవారి కళ్యాణోత్సవాన్ని చూసి తరించాల్సిందే. 
 
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామికి కళ్యాణోత్సవాన్ని కనులారా వీక్షిస్తే.. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే శ్రీవారికి కళ్యాణోత్సవం చేయిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అంతేగాకుండా కుజ, రాహు దోషాలు తొలగిపోతాయి. పెళ్లి సంబంధాలు కుదురుతాయని పండితులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments