Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాలయ పక్షం 30-09-2023.. పితృదోషాలు తొలగిపోవాలంటే..?

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (21:35 IST)
మహాలయ పక్షం 30-09-2023 తేదీన వస్తోంది. ఈ మహాలయ పక్షం పితృశాపాలను దూరం చేస్తుంది. పితృదేవతలకు శ్రాద్ధం ఇచ్చేందుకు ఈ మహాలయ పక్షం ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 
పూర్వీకులు మరణించిన నెల, తేదీ ఏంటో తెలుసుకుని ప్రతి సంవత్సరం అదే తేదీన తిథి ఇవ్వాలి. లేకుంటే కుటుంబంలో కష్టాలు, సమస్యలు చోటుచేసుకుంటాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. పితృపూజలు సక్రమంగా చేస్తే పితృదోషాల నుంచి బయటపడవచ్చు. 
 
కొంతమందికి తమ పూర్వీకులు మరణించిన తేదీ తెలియకపోవచ్చు. వారు మహాలయ పక్షంలో, మహాలయ అమావాస్యల్లో శ్రాద్ధం ఇవ్వడం చేయవచ్చు.  భాద్రపద కృష్ణ పక్ష పాడ్యమి నుంచి మ‌హాల‌య‌ అమావాస్య వరకు ఉన్న 15 రోజులను పితృపక్షంగా పిలుస్తాం. ఈ 15 రోజులు పెద్దలకు ప్రీతిపాత్రమైనవి. ఈ ప‌దిహేను రోజుల‌పాటు పితృకార్యాలు నిర్వహిస్తారు క‌నుక ఎలాంటి శుభ‌కార్యాలు చేయ‌రు. 
 
ఈ మహాలయ ప‌క్షంలో పూర్వీకులు త‌మవారి వద్దకు తిరిగి వ‌స్తార‌ని విశ్వసిస్తారు. అందుక‌ని వారిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రాద్ధకర్మలను ఆచ‌రించాలి. వారికి ఇష్టమైన వంటలు చేసి వారిని స్మరించుకుంటూ ఆవులు, కుక్కలు, కాకులకు పెట్టండి. ఇది కాకుండా బ్రాహ్మణులకు, పేదలకు ఆహారం, వ‌స్త్రాదుల‌ను ఇవ్వండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బస్సులో నిద్రపోతున్న యువతిని తాకరాని చోట తాకుతూ లైంగికంగా వేధించిన కండక్టర్ (video)

Indus Waters Treaty పాకిస్తాన్ పీచమణచాలంటే సింధు జల ఒప్పందం రద్దు 'అణు బాంబు'ను పేల్చాల్సిందే

24 Baby Cobras: కన్యాకుమారి.. ఓ ఇంటి బీరువా కింద 24 నాగుపాములు

బందీపొరాలో లష్కరే టాప్ కమాండర్ హతం

మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

అన్నీ చూడండి

లేటెస్ట్

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

తర్వాతి కథనం
Show comments