Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ రచయిత్రి వసుధారాణితో నాట్స్ ఇష్టాగోష్టి

ఐవీఆర్
సోమవారం, 22 ఏప్రియల్ 2024 (22:31 IST)
అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణలో భాగంగా నాట్స్ తెలుగు లలిత కళా వేదిక ద్వారా అంతర్జాల వేదికగా సదస్సులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ ప్రముఖ రచయిత్రి వసుధారాణితో ఇష్టాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. తాను ఎలా రచయిత్రిగా మారారు..? తనకు పుస్తకాలు చదవడం అనేది ఎలా అలవాటుగా మారింది..? తన జీవితంలో అది ఎలాంటి మార్పులు తెచ్చింది..? ఆలోచన ధోరణిని ఎలా మార్చిందనే విషయాలను వివరించారు.
 
తను వ్రాసిన కవిత సంపుటిలు, కథా సంపుటిల గురించి ఈ వెబినార్‌లో వివరించారు. తెలుగు సాహిత్యం ఎంతో గొప్పదని చలం సాహిత్యం తనపై ప్రభావం చూపిందని ఆమె తెలిపారు. జిడ్డు కృష్ణమూర్తి ఆలోచనల్లో ఈ సమాజాన్ని ఎలా చూడాలి.? మనిషి ఎలా ఉండాలనే విషయాలు బోధపడ్డాయన్నారు. తెలుగు సాహిత్యంపై నేటి తరం కూడా మక్కువ పెంచుకోవాల్సిన అవసరాన్ని వసుధారాణి నొక్కి చెప్పారు. తెలుగు భాష మనందరిని కలుపుతుందని.. ఆ భాష మరింత దేదీప్యమానంగా మారడానికి సాహిత్యం ఎంతగానో దోహపపడుతుందని వసుధారాణి తెలిపారు. 
 
అమెరికాలో ఉండే తెలుగు వారికి తెలుగు సాహిత్య, సంగీత, సాంస్కృతిక ప్రముఖులను పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఆన్‌లైన్ వేదికగా నాట్స్ తెలుగు లలిత కళా వేదిక ద్వారా ఇష్టాగోష్టి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి అన్నారు. ఈ ఇష్టాగోష్టి కార్యక్రమానికి శాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ వ్యాఖ్యతగా వ్యవహరించారు. నాట్స్ తెలుగు లలిత కళా వేదికకు వచ్చి తమ విలువైన అనుభవాలను పంచుకున్నందుకు నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని వసుధారాణికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments