Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడి పెళ్లి కోసం భార్య ఇండియాకు, అమెరికాలో భర్త మంచంపై శవమై తేలాడు

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (15:51 IST)
విదేశాల మోజు మొదట్లో బాగానే వుంటుంది. కానీ ఏదయినా అనుకోనిది జరిగినప్పుడు గుండెలు బద్ధలవుతాయి. ఇలాంటిదే ఒకటి అమెరికాలో ఓ తెలుగు కుటుంబానికి ఎదురైంది.
 
వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బోడుప్పల్‌కు చెందిన శ్రీధర్ ఆరేళ్ల క్రితం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా స్థిరపడ్డాడు. తన భార్య ఝాన్సీ, కుమారుడు శ్రీజన్‌తో కలిసి వుంటున్నాడు. ఐతే గత మార్చి నెలలో తన సోదరుడి వివాహం వుండటంతో భార్య ఝాన్సీ ఇండియా వచ్చింది. కరోనా లాక్ డౌన్‌తో ఆమె ఇక్కడే చిక్కుకుపోయింది.
 
ఇక అప్పట్నుంచి శ్రీధర్ ఒంటరిగా అక్కడే వుంటున్నాడు. ఐతే అతడి కుటుంబానికి పిడుగులాంటి వార్త చేరింది. శ్రీధర్ గత నెల 27వ తేదీ మృతి చెందాడని చెప్పారు. అతడు చనిపోయిన వారం తర్వాత ఈ వార్త తెలియడంతో అతడి భార్య, కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. మృతదేహానికి కోవిడ్, పోస్టుమార్టం నిర్వహించినా అతడి భౌతికకాయాన్ని పంపించడంలో అయోమయం నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి తన భర్త పార్థీవశరీరాన్ని భారతదేశానికి తెప్పించాల్సిందిగా భార్య ఝాన్సీ కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

తర్వాతి కథనం
Show comments