Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో శివమొగ్గ వాసి పంట పండింది.. రూ.24 కోట్ల బంపర్ లాటరీ!

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (11:13 IST)
ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లిన శివమొగ్గ వాసికి అదృష్టం కలిసివచ్చింది. దుబాయ్ ప్రభుత్వం నిర్వహించే లాటరీలో ఏకంగా రూ.24 కోట్ల బంపర్ లాటరీని గెలుచుకున్నాడు. ఈ అదృష్టవంతుడి పేరు శివమూర్తి కృష్ణప్ప. కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతవాసి. 
 
ఈయన వృత్తిరీత్యా ఓ మెకానికల్ ఇంజినీరు. గత 15 ఏళ్లుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నివసిస్తున్నాడు. ఇటీవల కృష్ణప్ప కొనుగోలు చేసిన లాటరీ (నెంబరు 202511) టికెట్‌కు ప్రథమ బహుమతి లభించింది. ఈ టిక్కెట్‌ను గత నెల 17వ తేదీన కొనుగోలు చేశాడు. 
 
ఈ బహుమతి భారత కరెన్సీలో రూ.24 కోట్లకు పైగా ఉంటుందట. గత మూడేళ్లుగా ప్రతి నెలా లాటరీలు కొంటుంటే ఇన్నాళ్లకు తన కల నెరవేరిందని కృష్ణప్ప పట్టరాని సంతోషంతో చెప్పాడు. 
 
కాగా, ఈసారి ఒకేసారి రెండు టికెట్లు కొనేందుకు నిర్వాహకులు అనుమతించడంతో తన అదృష్టం పండిందని తెలిపాడు. ఈ డబ్బుతో సొంతూర్లో ఓ ఇల్లు కట్టి, మిగతా డబ్బు పిల్లల చదువులు, వారి భవిష్యత్ కోసం దాచుకుంటానని ఆ ఇంజినీర్ వెల్లడించాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments