పడవేయకండి.. దానం చేయండి: నాట్స్ సరికొత్త కార్యక్రమం

Webdunia
బుధవారం, 4 మే 2022 (21:00 IST)
ఇంట్లో పిల్లలు వాడే ఎలక్ట్రానిక్ పరికరాలను కాస్త చిన్న రిపేర్ రాగానే చాలామంది చెత్త బుట్టలో పడేస్తుంటాం. కానీ అలాంటి పరికరాలు కొనలేని శరణార్ధుల పిల్లలు కోట్లాది మంది ఉన్నారు.. ఎప్పుడూ సేవాపథంలో వినూత్నంగా ఆలోచించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఈ సారి సరికొత్త కార్యక్రమంతో ముందుకొచ్చింది.

 
డోన్ట్ డిచ్ ఇట్, డోనేట్ ఇట్ (పడవేయకండి.. దానం చేయండి) అనే ఈ కార్యక్రమం ద్వారా ఇళ్లలో మైనర్ రిపేర్లు ఉండి వాడకుండా పడేసిన ఎలక్ట్రానిక్ పరికరాలు (కంప్యూటర్లు, కీబోర్డులు, ఐపాడ్స్, మొబైల్ ఫోన్స్, లాప్‌టాప్స్, కెమెరా, స్పీకర్లు) సేకరిస్తుంది ఇలా సేకరించిన వాటిని నాట్స్ రిపేర్లు చేయించి శరణార్ధుల పిల్లలకు అందించాలని సంకల్పించింది. 

 
గతంలో మేరీ ల్యాండ్‌కు చెందిన12 సంవత్సరాల మిడిల్ స్కూల్ విద్యార్ధిని మన తెలుగమ్మాయి శ్రావ్య అన్నపరెడ్డి ఈ కార్యక్రమాన్ని కోవిడ్ సమయంలో చేపట్టారు. అప్పట్లో  ప్రెసిడెంట్ ట్రంప్ కూడా శ్రావ్య సేవా పథాన్ని కొనియాడుతూ ఆమెను సత్కరించారు. ఇదే స్ఫూర్తిని తీసుకుని నాట్స్  బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజ్ అల్లాడ చొరవతో అమెరికా అంతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. డోన్ట్ డిచ్ ఇట్.. డోనేట్ ఇట్ నినాదంతో ముఖ్యంగా విద్యార్ధులను ఇందులో భాగస్వాములను చేస్తూ ముందుకు సాగనుంది.

 
విద్యార్థి దశలోనే ఈ సమాజానికి నేనేం ఇవ్వగలను అనే బలమైన ఆకాంక్షను విద్యార్ధుల్లో పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి ఈ సందర్భంగా తెలిపారు. సేవాభావంతో పాటు విద్యార్ధుల్లో నాయకత్వ లక్షణాలు కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా అలవడతాయని.. సాటి మనిషికి సాయం చేయడంలో కచ్చితంగా తమ వంతు పాత్ర పోషించాలనే బాధ్యత వస్తుందని నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రాజ్ అల్లాడ అన్నారు. 

 
నాట్స్ అమెరికాలో ప్రతి రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకెళుతుందని నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ విజయశేఖర్ అన్నె తెలిపారు. నాట్స్ వాలంటీర్లు వారి పిల్లలంతా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు ముందుకు రావాలని నాట్స్ నాయకులు పిలుపునిచ్చారు. తమకు అవసరం లేదనిపించి ఇంట్లో వాడకుండా ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా విద్యార్ధులు సేకరించి తమకు పంపాలని నాట్స్ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇంధన సంక్షోభం - కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించిన ప్రధాని మోడీ

వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి ఇకపై శాశ్వతంగా కొనసాగుతుంది.. ఏపీ సీఎం చంద్రబాబు

పరారీలో బండి సంజయ్ కుమారుడు.. పోలీసు విచారణకు డుమ్మా

సీఎం విజయ్ ఎఫెక్ట్.. కాశ్మీర్‌కు పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య.. ఎందుకో తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరం, ఆంధ్రప్రదేశ్ లైసెన్స్డ్ సర్వీస్ ఏరియా పరిధిలో నెట్‌వర్క్ నాణ్యతను ట్రాయ్ అంచనా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

KJR: మన దేశానికి నేషనల్ గేమ్ అనేదే లేదని చెప్పే గుర్తింపు ట్రైలర్

భర్తతో విడిపోతున్న నటి మౌనీరాయ్.... స్పందించిన బాలీవుడ్ నటి

iBOMMA: ఆన్‌లైన్‌లో తిరిగి ప్రత్యక్షమైన ఐబొమ్మ.. షాకైన సినీ ప్రపంచం

తర్వాతి కథనం
Show comments