Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ జయంతి సందర్భంగా డాలస్లో ప్లాజాలో ప్రత్యేక కార్యక్రమాలు : ప్రసాద్ తోటకూర

Webdunia
శుక్రవారం, 2 అక్టోబరు 2015 (10:34 IST)
మహాత్మా గాంధీ 146వ జయంతిని పురస్కరించుకొని అమెరికాలోని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డాలస్లోని పార్క్ ప్లాజా టవర్ వద్ద ఈ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు విందు భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎంజీఎంఎన్టీ) ఛైర్మన్ ప్రసాద్ తోటకూర తెలిపారు. 
 
అలాగే, అదేవిధంగా టెక్సాస్లోని ఇర్వింగ్లో ఉన్న మహాత్మ గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద ఈ శనివారం సాయంత్రం 8 గంటలకు 'గాంధీ శాంతి పాదయాత్ర (నడక)'ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పాదయాత్రకు ముందు శాంతికి చిహ్నమైన తెల్ల పావురాలను ఆకాశంలోకి ఎగుర వేస్తామని తెలిపారు. 
 
ఈ కార్యక్రమాలకు హాజరయ్యే వారిని తెల్ల దుస్తులు ధరించి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఈ రెండు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మహాత్మా గాంధీ ముని మనవరాలు సుకన్య భరత్ రామ్ హాజరవుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి రావు కల్వల, శ్రీనివాస్ గునుకుల, తైయాబ్ కుండవల, జాక్ గోదావని, అక్షయ్ వని, పీయూష్ పటేల్, షబ్నం మోగ్లీ, జీన్ హమెండ్ తదితరులు సహకరించనున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments