Webdunia - Bharat's app for daily news and videos

Install App

40 మంది NRIలను మింగేసిన కరోనా వైరస్, యూఎస్‌లో భయంభయంగా ఎన్నారైలు

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (19:15 IST)
కరోనా వైరస్ అమెరికాను కేంద్రంగా చేసుకున్నదా అనిపిస్తోంది. అక్కడ రోజుకి వేలల్లో కరోనా వైరస్ సోకిన రోగులు మరణిస్తున్నారు. ఈ రాకాసి కరోనావైరస్ కారణంగా 40 మందికి పైగా భారతీయ-అమెరికన్లు, భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. మరోవైపు ఎన్నారైలలో సుమారు 1500 మందికి కరోనా వైరస్ పాజిటివ్ పరీక్షలు చేశారనీ, ఆ ఫలితాలు ఇంకా రావాల్సి వుందని చెప్పారు.
 
గత 24 గంటల్లో అమెరికాలో ఏకంగా 2,108 మరణాలు సంభవించాయి. ఒకే రోజులో 2,000 కంటే ఎక్కువ COVID-19 మరణాలను నమోదు చేసిన అమెరికా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా నిలిచింది. అమెరికాలో కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య 5,00,000 దాటిపోయింది.
 
అమెరికాలోని COVID-19 కేంద్రంగా మారిన న్యూయార్క్, ప్రక్కనే ఉన్న న్యూజెర్సీల్లోనే అధికంగా మరణాలు సంభవిస్తున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ దేశంలో భారతీయ-అమెరికన్లు వుండే అత్యధిక ప్రాంతాలుగా వున్నాయి. కాగా కరోనా వైరస్ కారణంగా మరణించిన వారిలో 17 మంది కేరళకు చెందినవారనీ, 10 మంది గుజరాత్ నుండి, పంజాబ్ నుండి నలుగురు, ఆంధ్రప్రదేశ్ నుండి ఇద్దరు, ఒరిస్సాకు చెందినవారు ఒకరు ఉన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments