Webdunia - Bharat's app for daily news and videos

Install App

40 మంది NRIలను మింగేసిన కరోనా వైరస్, యూఎస్‌లో భయంభయంగా ఎన్నారైలు

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (19:15 IST)
కరోనా వైరస్ అమెరికాను కేంద్రంగా చేసుకున్నదా అనిపిస్తోంది. అక్కడ రోజుకి వేలల్లో కరోనా వైరస్ సోకిన రోగులు మరణిస్తున్నారు. ఈ రాకాసి కరోనావైరస్ కారణంగా 40 మందికి పైగా భారతీయ-అమెరికన్లు, భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. మరోవైపు ఎన్నారైలలో సుమారు 1500 మందికి కరోనా వైరస్ పాజిటివ్ పరీక్షలు చేశారనీ, ఆ ఫలితాలు ఇంకా రావాల్సి వుందని చెప్పారు.
 
గత 24 గంటల్లో అమెరికాలో ఏకంగా 2,108 మరణాలు సంభవించాయి. ఒకే రోజులో 2,000 కంటే ఎక్కువ COVID-19 మరణాలను నమోదు చేసిన అమెరికా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా నిలిచింది. అమెరికాలో కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య 5,00,000 దాటిపోయింది.
 
అమెరికాలోని COVID-19 కేంద్రంగా మారిన న్యూయార్క్, ప్రక్కనే ఉన్న న్యూజెర్సీల్లోనే అధికంగా మరణాలు సంభవిస్తున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ దేశంలో భారతీయ-అమెరికన్లు వుండే అత్యధిక ప్రాంతాలుగా వున్నాయి. కాగా కరోనా వైరస్ కారణంగా మరణించిన వారిలో 17 మంది కేరళకు చెందినవారనీ, 10 మంది గుజరాత్ నుండి, పంజాబ్ నుండి నలుగురు, ఆంధ్రప్రదేశ్ నుండి ఇద్దరు, ఒరిస్సాకు చెందినవారు ఒకరు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

తర్వాతి కథనం
Show comments