రుచికరమైన రొయ్యల కట్‌లెట్

Webdunia
శనివారం, 27 డిశెంబరు 2014 (16:25 IST)
కావలసిన పదార్థాలు :
చిన్న రొయ్యలు - 150 గ్రాములు
శనగపిండి - రెండు స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్
ఉల్లిపాయ - ఒకటి
పసుపు - అర టీస్పూన్
కారం - అర టీస్పూన్
గరం మసాలా పొడి - ఒక స్పూన్
కొత్తిమీర - చిన్న కట్ట
నిమ్మరసం - ఒక స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
బియ్యం పిండి - అరకప్పు
నూనె - వేయించడానికి సరిపడినంత
తయారు చేయండి ఇలా :
మొదట రొయ్యలను పొట్టు తీసి శుభ్రం చేసుకుని, ఉప్పు, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం పట్టించి 10 నిమిషాల పాటు పక్కనుంచాలి. ఉల్లిపాయ, కొత్తిమీర సన్నగా తరిగి అందులో కారం, గరంమసాలా పొడి, శనగ పిండితోపాటు రొయ్యల్ని కూడా వేసి ముద్దలా తయారు చేసుకోవాలి. దీన్ని ఆరు భాగాలుగా చేసుకోవాలి. ఒక్కో ముద్దని వడలా వత్తుకుని రెండు వైపులా బియ్యం పిండిలో ముంచి, నూనెలో దోరగా వేయించాలి. వీటిని వేడి వేడిగా టొమాటో సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి. చిన్న పిల్లలు వీటిని బాగా ఇష్టపడతారు. ఇది చాలా బలవర్థకమైన ఆహారం కూడా.
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బరువు తగ్గాలనుకుంది.. ఆ మందు తిని ప్రాణాలు కోల్పోయింది...

మేడారం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు.. 4వేల బస్సులు నడుపుతాం.. పొన్నం

రెండేళ్లలో 416మందితో డేటింగ్.. మహిళ షాకింగ్ స్టోరీ

హైదరాబాద్‌లో భూముల వేలం తిరిగి ప్రారంభం.. ప్రభుత్వం ఆమోదం

అనుమానం.. భార్యను వేధించాడు.. ఆపై రోకలితో బాది హత్య.. స్టేటస్ కూడా పెట్టాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పీరియాడిక్ కథతో టొవినో థామస్ మూవీ పళ్లి చట్టంబి రూపొందుతోంది

పి.వి.నరసింహారావు రాసిన కథ ఆధారంగా గొల్ల రామవ్వ రాబోతోంది

Chandrabose: ఉస్తాద్ భగత్ సింగ్ లో బ్యాక్ గ్రౌండ్ గీతాన్ని కసరత్తు చేస్తున్న చంద్రబోస్

కన్నె పిట్టారో.. పాట పాడుతూ డెకాయిట్ పూర్తిచేశానన్న మృణాల్ ఠాకూర్

NTR: మరోసారి బ్రేక్ పడిన ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్

Show comments