Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రా చేపల పులుసు కంటే గోవా చేపల కూర బాగుంటుందా?

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (12:44 IST)
తెలుగు ప్రజలకు ఆంధ్రా చేపల పులుసు అంటే అమితమైన ఇష్టం. అందుకే ఆంధ్రా చేపల పులుసు అంటే ప్రతి ఒక్కరూ లొట్టలేసుకుని ఆరగిస్తుంటారు. అలాగే, గోవా ప్రజలకు కూడా ఓ రుచికరమైన కూర ఉంది. అదే గోవా చేపల కూర. ఈ కూరను ఎలా తయారు చేస్తారో ఓసారి తెలుసుకుందాం. 
 
కావల్సినవి:
చేపలు - అరకేజీ, 
కొబ్బరి తురుము - ముప్పావు కప్పు, 
ఉల్లిపాయలు - 3, 
కారం - 3 టేబుల్‌స్పూన్లు, 
ధనియాల పొడి - అర టేబుల్‌ స్పూను, 
పసుపు - టేబుల్‌ స్పూను, 
మెంతులు - పావు చెంచా, 
కరివేపాకు రెబ్బ- ఒకటి, 
చింతపండు రసం - పావుకప్పు, 
ఉప్పు - తగినంత, 
నూనె - 3 టేబుల్‌ స్పూన్లు.
 
తయారీ విధానం.. 
బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి కొబ్బరి తురుము, కారం చేర్చాలి. అందులోనే ధనియాలపొడి, ఉల్లిపాయ ముక్కలు, మెంతులు, కరివేపాకు రెబ్బలు వేయాలి. కొబ్బరి బంగారువర్ణంలోకి వచ్చాక దింపేయాలి. పూర్తిగా చల్లారనిచ్చి చింతపండు రసం చేర్చి మెత్తగా చేసుకోవాలి.

ఇప్పుడు బాణలిలో మిగిలిన నూనె వేడి చేసి ఈ మిశ్రమాన్ని వేయాలి. ఇందులోనే పసుపు, సరిపడా ఉప్పు వేసి, మిశ్రమం చిక్కగా అయ్యాక చేప ముక్కల్ని కలపాలి. అవి ఉడికేందుకు సరిపడా నీళ్లు చేర్చి, మంట తగ్గించి మూత పెట్టేయాలి. అంతే చేపల కూర సిద్ధం. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments