Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రా చేపల పులుసు కంటే గోవా చేపల కూర బాగుంటుందా?

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (12:44 IST)
తెలుగు ప్రజలకు ఆంధ్రా చేపల పులుసు అంటే అమితమైన ఇష్టం. అందుకే ఆంధ్రా చేపల పులుసు అంటే ప్రతి ఒక్కరూ లొట్టలేసుకుని ఆరగిస్తుంటారు. అలాగే, గోవా ప్రజలకు కూడా ఓ రుచికరమైన కూర ఉంది. అదే గోవా చేపల కూర. ఈ కూరను ఎలా తయారు చేస్తారో ఓసారి తెలుసుకుందాం. 
 
కావల్సినవి:
చేపలు - అరకేజీ, 
కొబ్బరి తురుము - ముప్పావు కప్పు, 
ఉల్లిపాయలు - 3, 
కారం - 3 టేబుల్‌స్పూన్లు, 
ధనియాల పొడి - అర టేబుల్‌ స్పూను, 
పసుపు - టేబుల్‌ స్పూను, 
మెంతులు - పావు చెంచా, 
కరివేపాకు రెబ్బ- ఒకటి, 
చింతపండు రసం - పావుకప్పు, 
ఉప్పు - తగినంత, 
నూనె - 3 టేబుల్‌ స్పూన్లు.
 
తయారీ విధానం.. 
బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి కొబ్బరి తురుము, కారం చేర్చాలి. అందులోనే ధనియాలపొడి, ఉల్లిపాయ ముక్కలు, మెంతులు, కరివేపాకు రెబ్బలు వేయాలి. కొబ్బరి బంగారువర్ణంలోకి వచ్చాక దింపేయాలి. పూర్తిగా చల్లారనిచ్చి చింతపండు రసం చేర్చి మెత్తగా చేసుకోవాలి.

ఇప్పుడు బాణలిలో మిగిలిన నూనె వేడి చేసి ఈ మిశ్రమాన్ని వేయాలి. ఇందులోనే పసుపు, సరిపడా ఉప్పు వేసి, మిశ్రమం చిక్కగా అయ్యాక చేప ముక్కల్ని కలపాలి. అవి ఉడికేందుకు సరిపడా నీళ్లు చేర్చి, మంట తగ్గించి మూత పెట్టేయాలి. అంతే చేపల కూర సిద్ధం. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments