Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల ఇగురు తయారీ విధానం...

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (12:55 IST)
కావలసినవి:
 
చేపలు - అరకేజీ
 
ఉల్లిపాయలు - నాలుగు
 
పచ్చిమిర్చి - నాలుగు
 
కారం - రెండు టీస్పూన్లు
 
జీలకర్ర పొడి - టీస్పూన్
 
ధనియాల పొడి - ఒక టీస్పూన్
 
పసుపు - టీస్పూన్
 
టొమాటో - ఒకటి
 
అల్లం వెల్లుల్లి పేస్టు - టీస్పూన్
 
కొత్తమీర - కట్ట
 
నూనె - తగినంత
 
ఉప్పు - తగినంత
 
తయారీ విధానం:
 
ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి కొద్దిగా కారం, పసుపు, ఉప్పు వేసి కలియబెట్టి, అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్ తీసుకొని నూనె వేసి కాస్త వేడి అయ్యాక చేప ముక్కలు వేసుకుని కాసేపు వేగించి పక్కన పెట్టుకోవాలి. మరొకపాత్రలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మరికాసేపు వేగించాలి. కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి మరి కాసేపు వేగించాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. తరువాత వేగించి పెట్టుకున్న చేప ముక్కలు వేసి మరి కాసేపు ఉడికించాలి. కొత్తిమీర వేసుకుని వేడి వేడిగా తింటే చేపల ఇగురు టేస్ట్ సూపర్బ్‌‌‌గా ఉంటుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments