మొదట గుడ్లను బంగాళదుంపలను ఉడికించుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనె వేసి, వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మరియు అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో టమోటో ముక్కలు వేసి మరో ఐదు నిముషాల పాటు వేయించుకోవాలి.
తర్వాత అందులోనే ముందుగా ఉడికించి పెట్టుకొన్న బంగాళదుంపలకు, గుడ్లకు పొట్టు తేసేయాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. వీటితో పాటు, కారం, గరం మసాలా, పసుపు, ధనియాలపొడి కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి.
ఇలా ఫ్రై చేస్తూనే సరిపడా నీళ్ళు, రుచికి సరిపడా ఉప్పు వేసి, మూత పెట్టాలి చివరిగా 10నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. గ్రేవీ చిక్కబడిన తర్వాత స్టౌవ్ ఆఫ్ చేయాలి. అంతే ఈవెనింగ్ స్పెషల్ ఎగ్ - పటోటా కర్రీ రెడీ. దీనిని చపాతీ, పూరి, పరాటా, దోస ఇడ్లీ అంటూ దేనికైనా సైడిష్గా వాడుకోవచ్చు.