Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ భావోద్వేగం.. అద్వానీ గురించి మాట్లాడుతూ..!

Webdunia
మంగళవారం, 20 మే 2014 (13:27 IST)
FILE
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. భరతమాతకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు, బీజేపీ ఇచ్చిన వరమని మోడీ వ్యాఖ్యానించారు. దేశంకూడా కన్నతల్లి లాంటిదేనని, ఆ తల్లిపై చూపించాల్సింది కనికరం కాదు సేవ అని మోడీ వ్యాఖ్యానించారు.

అద్వానీ గురించి మాట్లాడుతూ కంటతడిపెట్టిన మోడీ పార్టీ, ఆ పార్టీ సీనియర్ నేతలు అద్వానీ, రాజ్ నాథ్ సింగ్‌ల ఆశీర్వాద బలమే తనను ఈ స్థాయికి నిలబెట్టిందన్నారు.

భారత ప్రజల ఆకాంక్షలే తనను ఇక్కడ నిలబెట్టాయని మోడీ చెప్పారు. బీజేపీ దయవల్లే భరతమాతకు సేవ చేసే అవకాశం దక్కిందని ఆయన అన్నారు.

భారతదేశానికి స్వాతంత్యం తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వారి తరహాలో పాలన సాగించాయని, ముందు ప్రభుత్వాల పాలనలోని మంచిని స్వీకరిస్తామని మోడీ చెప్పారు. బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఇచ్చారంటే, అది తమ పార్టీ మీద ఉన్న నమ్మకమేనని ఆయన చెప్పారు.

ప్రజల ఆకాంక్షలు, కలలు నెరవేరుస్తామన్న ఆశలు తమపై పెట్టుకున్నారన్నారు. మార్పు కోసం యావత్ భారతదేశం కదిలిందని మోడీ అన్నారు. ప్రతి క్షణం, శరీరంలోని ప్రతి కణం దేశం కోసం పరితపిస్తోందని ఆయన అన్నారు.

దేశం కోసం నిరంతరం శ్రమిస్తానని మోడీ తెలిపారు. తనలాంటి నిరుపేదను అందలమెక్కించిన ప్రజాస్వామ్య వ్యవస్థ మనదని మోడీ చెప్పారు. పేదల ఆకాంక్షలను నెరవేర్చేదే నిజమైన ప్రభుత్వమని చెప్పారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments