Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ భావోద్వేగం.. అద్వానీ గురించి మాట్లాడుతూ..!

Webdunia
మంగళవారం, 20 మే 2014 (13:27 IST)
FILE
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. భరతమాతకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు, బీజేపీ ఇచ్చిన వరమని మోడీ వ్యాఖ్యానించారు. దేశంకూడా కన్నతల్లి లాంటిదేనని, ఆ తల్లిపై చూపించాల్సింది కనికరం కాదు సేవ అని మోడీ వ్యాఖ్యానించారు.

అద్వానీ గురించి మాట్లాడుతూ కంటతడిపెట్టిన మోడీ పార్టీ, ఆ పార్టీ సీనియర్ నేతలు అద్వానీ, రాజ్ నాథ్ సింగ్‌ల ఆశీర్వాద బలమే తనను ఈ స్థాయికి నిలబెట్టిందన్నారు.

భారత ప్రజల ఆకాంక్షలే తనను ఇక్కడ నిలబెట్టాయని మోడీ చెప్పారు. బీజేపీ దయవల్లే భరతమాతకు సేవ చేసే అవకాశం దక్కిందని ఆయన అన్నారు.

భారతదేశానికి స్వాతంత్యం తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వారి తరహాలో పాలన సాగించాయని, ముందు ప్రభుత్వాల పాలనలోని మంచిని స్వీకరిస్తామని మోడీ చెప్పారు. బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఇచ్చారంటే, అది తమ పార్టీ మీద ఉన్న నమ్మకమేనని ఆయన చెప్పారు.

ప్రజల ఆకాంక్షలు, కలలు నెరవేరుస్తామన్న ఆశలు తమపై పెట్టుకున్నారన్నారు. మార్పు కోసం యావత్ భారతదేశం కదిలిందని మోడీ అన్నారు. ప్రతి క్షణం, శరీరంలోని ప్రతి కణం దేశం కోసం పరితపిస్తోందని ఆయన అన్నారు.

దేశం కోసం నిరంతరం శ్రమిస్తానని మోడీ తెలిపారు. తనలాంటి నిరుపేదను అందలమెక్కించిన ప్రజాస్వామ్య వ్యవస్థ మనదని మోడీ చెప్పారు. పేదల ఆకాంక్షలను నెరవేర్చేదే నిజమైన ప్రభుత్వమని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

Show comments