ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చాలా కష్టమని మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ అన్నారు. అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత తృతీయ కూటమికి కాంగ్రెస్ మద్దతిచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు.
బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు మూడో ఫ్రంట్కు మద్దతివ్వడమే మంచిదనే ఆలోచన కాంగ్రెస్లో మొదలైనట్లు ఆయన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతివ్వడం తెరిచి ఉంచిన ఆప్షన్ అని ఆయన చెప్పారు.
మోడీ సారథ్యంలో బీజేపీకి 170 సీట్లకు మించి రావన్నారు. కాంగ్రెస్ లేదా థర్డ్ ఫ్రంట్కే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.