ఫేస్బుక్లో పరిచయంతో రెండున్నర సంవత్సరాల పాటు సాగిన వారి ప్రేమ చివరకు విషాదంతో ముగిసింది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్కు చెందిన వినీత్ సింగ్(22)కు మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన జ్యోతి కొరి(44)తో రెండున్నరేళ్ల క్రితం ఫేస్బుక్లో పరిచయమైంది. అప్పటికే పిల్లల తల్లి అయిన జ్యోతి ఫేస్బుక్లో తన ఫోటో కాకుండా వేరే వాళ్ల ఫోటోలు పెట్టింది. ఆ ఫోటోలు చూసి ప్రేమలో పడ్డాడు వినీత్.
ఈ నేపథ్యంలో వారిద్దరూ తొలిసారిగా ఈనెల 18న జబల్పూర్లో కలుసుకున్నారు. ఫోటోలో ఉన్న అమ్మాయి, జ్యోతి ఒక్కరుకాదని గ్రహించిన వినీత్ ఆమె తనను మోసం చేసిందంటూ తనదగ్గర ఉన్న నాటుతుపాకీతో ఆమెను హతమార్చాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన వినీత్ జరిగినదంతా పోలీసులకు చెప్పి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.