Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరు బస్సు ప్రమాదంపై 304 సెక్షన్ కింద కేసు!

Webdunia
బుధవారం, 16 ఏప్రియల్ 2014 (12:33 IST)
File
FILE
కర్ణాటకలో మరో ఘోర బస్సు ప్రమాదం బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుందని, దీనికి సంబంధించి బస్సు డ్రైవర్, ఆపరేటర్‌పై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు ఆ రాష్ట్ర పోలీసులు వెల్లడించారు. దావణగెరె నుంచి బెంగుళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకోవడంతో కనీసం ఆరుగురు సజీవదహనం కాగా మరో 12 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

బెంగుళూరుకు 160 కిలోమీటర్ల దూరంలోని చిత్రదుర్గ జిల్లాలోని హిరియూర్ పట్టణంలో ఈ దుర్ఘటన జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో దావణగెరె నుంచి బెంగుళూరు వెళుతున్న ఒక ప్రైవేట్ బస్సు 4వ నంబర్ జాతీయ రహదారిపై మంటల్లో చిక్కుకుని పక్కనే ఉన్న గుంతలో పడిపోయిందని అని చిత్రదుర్గ ఎస్‌పి రవి కుమార్ తెలిపారు.

బస్సులో నుంచి ఇప్పటివరకు పూర్తిగా కాలిపోయిన ఆరు మృతదేహాలను వెలికితీశాము. బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా 20 మంది గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు అని ఎస్‌పి తెలిపారు.


ఐపిసిలోని 304 సెక్షన్ కింద బస్సు డ్రైవర్, ఆపరేటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సులో మంటలు చెలరేగడానికి కారణం తెలియరాలేదని ఎస్‌పి తెలిపారు. డ్రైవర్ సీటు సమీపంలోని ముందు భాగంలో మొదలైన మంటలు వేగంగా బస్సంతా వ్యాపించాయని, మంచి నిద్రలో ఉన్న ప్రయాణికులు మంటల్లో చిక్కుకుపోయారని ఆయన వివరించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments