దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ముంబై ఫోటో జర్నలిస్టు సామూహిక అత్యాచారం ఘటనకు సంబంధించిన ఐదవ నిందితుడు సలీం అన్సారీని మహారాష్ట్ర క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం న్యూఢిల్లీలో అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసు కమిషనర్ వెల్లడించారు.
అతన్ని సాధ్యమైనంత త్వరగా ముంబై తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు చెప్పారు. సలీం అరెస్ట్తో అత్యాచారం కేసులో మొత్తం నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు.
అయితే అత్యాచారానికి పాల్పడిన నాలుగో నిందితుడు కసీం బెంగాలీని గత అర్థరాత్రి అరెస్ట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
నిందితుల్లో చంద్బాబు సత్తార్ షేక్ అలియాస్ మహమ్మద్ అబ్దుల్ (19)ను పోలీసులు శుక్రవారమే అరెస్టు చేయగా, శనివారం మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.