యూపీఏ సర్కారు ప్రవేశపెట్టిన ఆహార భద్రతా బిల్లును తాము వ్యతిరేకించడం లేదని, దాన్ని కొన్ని సవరణలతో ఆమోదిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఆహార భద్రతా బిల్లును అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ను తీసుకురావడం ప్రజాస్వామ్య విఘాతానికి నిదర్శనమన్నారు.
అదేసమయంలో తాము బిల్లును వ్యతిరేకించబోమని, అయితే కొన్ని సవరణలు మాత్రం చేయాలని కోరతామన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును వ్యతిరేకించబోమన్నారు. అయితే ఏ సవరణలు బీజేపీ చేయబోతున్నదన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు.