Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంటుపై విశ్వాసం లేకపోతే మావోయిస్టుల్లో చేరండి: ప్రణబ్

Webdunia
2 జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో జేపీసీ విచారణకు ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ అర్థరహితమని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మరో మారు స్పష్టం చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ప్రతిపక్షాలకు విశ్వాసం లేకపోతే.. వారు మావోయిస్టుల్లో చేరాలని ఉచిత సలహా ఇచ్చారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొత్తం కోల్పోయాం. విపక్షానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో విశ్వాసం లేదని ఇది రుజువు చేస్తోంది. కనుక వారు మావోయిస్టుల్లో చేరవచ్చు అని బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో జరిగిన ఒక ర్యాలీలో అన్నారు.

ఇదిలావుండగా, స్పెక్ట్రమ్ కుంభకోణంపై జేపీసీ దర్యాప్తు వేయాల్సిందేనని, ఈ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. దీనిపై ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రతినిధి ప్రకాశ్ జవ్‌దేకర్ మాట్లాడుతూ.. వచ్చే నెలలో మొదలు కానున్న బడ్జెట్ సమావేశాల్లోనూ ఈ డిమాండ్‌ను వదిలేది లేదన్నారు. స్పెక్ట్రమ్ అంశంలో డీఎంకేతో కాంగ్రెస్ ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. కాగ్‌పై ప్రస్తుత టెలికామ్ మంత్రి కపిల్ సిబల్ ధ్వజమెత్తడంతో టెలికం మాజీ మంత్రి రాజాను నిర్ధోషిగా వదలిపెట్టేస్తారన్న సందేహం కలుగుతుందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

Show comments